టాలీవుడ్, కోలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నిత్యామీనన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ మాతృత్వం పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మాతృత్వం అనేది ఒక స్త్రీ యొక్క వ్యక్తిగత ఇష్టమని దానికి వివాహం అనేది తప్పనిసరి కాదు అంటూ తెలియజేసింది. పిల్లల్ని కనడం అనేది కూడా ఒక భాగోద్వేగాపూరితమైన మరియు బాధ్యతాయుతమైన నిర్ణయం అని, అలా అని ఒక సామాజిక కట్టుబాటు (పెళ్లి) ద్వారా జరగాలనుకోవడం  సరైనది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.


ఒక వ్యక్తి తన జీవితంలో పిల్లలు కావాలని కోరుకుంటే వివాహం వ్యవస్థతో సంబంధం లేకుండా ఆ నిర్ణయం తీసుకుని హక్కు  వారికి ఉంటుందని తెలియజేసింది. భారతీయ సమాజంలో వివాహం తరువాతే పిల్లలు అనే సాంప్రదాయం చాలా బలంగా ఉన్నది. మారుతున్న కాలంతో పాటు వ్యక్తులు ఆలోచనలు కూడా ప్రస్తుతం మారుతూ ఉన్నాయి అంటూ తెలియజేసింది నిత్యామీనన్. పెళ్లికి ముందు లేదా పెళ్లికి తర్వాత అనే ప్రశ్న కంటే.. ఎప్పుడు బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయమే ముఖ్యమంటూ తెలియజేసింది.


నిత్యామీనన్ నిరంతరం ఎప్పుడూ కూడా తన మనసులో ఉండే మాటని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఈ విషయంలో కూడా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవించాలని కోరింది. ప్రస్తుతం నిత్యామీనన్ చేసి ఈ వ్యాఖ్యల పైన పలువురు నెటిజెన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఉండగా మరి కొంతమంది భారతీయ సాంప్రదాయాలని గుర్తుచేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. చివరిగా ధనుష్ నటించిన ఇడ్లీ కడై అనే చిత్రంలో నటించిన ఆ తర్వాత మళ్లీ ఎటువంటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఇలాంటి చిత్రాలను నటిస్తుందొ చూడాలి మరి. పాత్ర నచ్చితే ఎలాంటి పాత్రలు అయినా చేయడానికి సిద్ధంగానే ఉంటుంది నిత్యామీనన్.

మరింత సమాచారం తెలుసుకోండి: