పుష్ప 2 విడుదల సందర్భంగా ప్రీమియర్ షో సమయం లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీ తేజ్, అతని తల్లి రేవతి అక్కడే మరణించగా శ్రీ తేజ్ మాత్రం తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలోకి వెళ్లారు. అలా ఆసుపత్రిలో కొన్ని నెలల పాటు కోమాలో ఉన్న శ్రీ తేజ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అల్లు అర్జున్. అంతేకాకుండా శ్రీ తేజ్ కు చికిత్స కోసం అవసరమైన ఖర్చులతో పాటు అతని కుటుంబానికి సైతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే ఆ చిన్నారి పేరు మీద రూ .2కోట్ల రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వేసినట్లు తెలుస్తోంది. శ్రీతేజ్ చెల్లెలితో అల్లు అరవింద్ ,స్నేహ రెడ్డి కూడా చాలా ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లల భవిష్యత్తు గురించి అడిగి తెలుసుకుని, వారి చదువుకి అయ్యే ఖర్చు కూడా తామే భరిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కేవలం ఆర్థిక సహాయమే కాకుండా స్వయంగా శ్రీ తేజ్ కుటుంబం దగ్గరికి వెళ్లి మరి పరామర్శించడం ద్వారా ఆ కుటుంబంలో కూడా మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి