యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాక్షసుడు ఇటీవల విడుదలై పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా 11.70 కోట్ల షేర్ ను రాబట్టింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రం 14 రోజుల్లో 10.60 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువవుతుంది. ఈ సినిమాకు ఇటీవల విడుదలైన శర్వానంద్ , రణరంగం అలాగే అడివి శేష్ ,ఎవరు చిత్రాలనుండి గట్టి పోటీ ఎదురువవుతుంది. అయితే రాక్షసుడు ఇక్కడ పర్వాలేదనిపించింది కానీ యూస్ లో మాత్రం అనుకున్నంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోవడంతో అక్కడ ఈ సినిమా ప్లాప్ సినిమాల జాబితాలో చేరిపోనుంది. ఓవర్సీస్ లో ఈ చిత్రం 80లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా ఇప్పటివరకు 70లక్షలను మాత్రమే రాబట్టింది. అక్కడ దాదాపుగా ఈసినిమా రన్ ముగిసినట్లే.
ఇక ఎప్పటినుండో బ్లాక్ బాస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయి శ్రీనివాస్ కు ఈచిత్రం ఆ రేంజ్ హిట్ అయితే ఇవ్వలేకపోయింది కానీ వరుస పరాజయాలకు బ్రేక్ వేసి ఈ హీరో కి ఊరటనిచ్చింది. కోలీవుడ్ లో బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించిన సైకో థ్రిల్లర్ మూవీ 'రాక్షసన్' కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి శ్రీనివాస్ కు జోడీగా అనుపమా పరమేశ్వరన్ నటించగా 'రైడ్' ఫేమ్ రమేష్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. గిబ్రాన్ సంగీతంఅందించిన ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు , హవీష్ లక్ష్మణ్ కోనేరు నిర్మించారు. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమా ను ప్రపంచ వ్యాప్తంగా విడుదలచేసింది. ఇక ఈ సినిమా తరువాత సాయి శ్రీనివాస్ ఇంకా కొత్త చిత్రానికి సైన్ చేయలేదు.