కత్రినా కైఫ్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అందులో సందేహం అవసరం లేదు. మల్లీశ్వరి అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కత్రినా ఆ తరువాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. కెరీర్ స్టార్టింగ్ లో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చినా వాటిల్లో పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. పేస్ లో ఎక్స్ ప్రెషన్ ఉండవని, గ్లామర్ రోల్స్ మాత్రమే చేయగలుగుతుందని అనేవారు.
అయితే, దాని నుంచి బయటపడేందుకు ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. చివరకు ఎలాగోలా సినిమా అవకాశాలు దక్కించుకున్నా.. అలాంటి మాటలు వినాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఆమె సల్మాన్ ఖాన్ తో సినిమాలు చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆమె లైఫ్ టర్న్ అయ్యింది. సల్మాన్ ఖాన్ తో సినిమాలు చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది.
ఇద్దరు కల్సి చాలా సినిమాలు చేశారు. బంధం బలపడింది. ఈ బంధం ఎంత స్ట్రాంగ్ అయ్యింది అంటే.. భారత్ సినిమా సమయంలో ప్రియాంక చోప్రా.. సల్మాన్ తో సినిమాను రద్దు చేసుకుంటే.. ఆ స్థానంలో ఎవరు వస్తారో అనుకుంటే.. కత్రినా కైఫ్ తన డేట్స్ ను అడ్జెస్ట్ చేసుకుంది. భారత్ సినిమా చేసింది. సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా హిట్ కావడంతో సల్మాన్ తో పాటు కత్రినాకు మంచి పేరు వచ్చింది.
కత్రినాను కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితం అనుకున్నారు. కానీ, ఈ సినిమాతో ఆమెలో మంచి నటి దాగుందని అర్ధం అయ్యింది. అయితే, సల్మాన్ తో ఉన్న రిలేషన్ షిప్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ చెల్లెల్లు అర్పిత తనకు సోదరి వంటిదని చెప్పింది. సల్మాన్ చెల్లెలు సోదరి అంటే సల్మాన్ బ్రదర్ అనే కదా అర్ధం. అలా ఎందుకు చెప్పినట్టు. పైగా సినిమాల విషయంలో మా బంధం వేరు అని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు.