గత కొద్ది రోజులుగా ఒక ప్రముఖ దిన పత్రిక టాలీవుడ్ హీరోల అహంకారం పై మితిమీరి పెరిగి పోతున్న పారితోషికాల పై నిర్మాతల దయనీయ పరిస్థుతుల పై ప్రచురిస్తున్న వార్తలు టాలీవుడ్ లో సంచలనాలు సృస్టిస్తున్నాయి. వెలుగుల సినిమా ప్రపంచం వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను అత్యంత ధైర్యంగా ప్రచురిస్తున్న ఆ పత్రిక సాహసం ఇప్పుడు టాలీవుడ్ కు హాట్ టాపిక్ గా మారింది.
ఒక విశ్లేషణలలో హీరో రానాను టార్గెట్
ఆ పత్రిక ఈరోజు ప్రచురించిన ఒక విశ్లేషణలలో హీరో రానాను టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తోంది. రానా పేరు స్పష్టంగా ప్రస్తావించకపోయినా ఆ వార్తను చదివిన వారికి రానా ను దృష్టిలో పెట్టుకుని ఈ వార్త ప్రచురించారా అనే అనుమానం వస్తుంది. చెన్నైలో ఒక ప్రముఖ స్టూడియోను నిర్వహిస్తూ తరతరాలుగా సినిమాలు తీస్తున్న చెట్టియార్ కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో ఒక ప్రముఖ నిర్మాత మనవడిని హీరోగా పెట్టి సినిమా తీయాలని హైదరాబాద్ వచ్చి మీ మనవడికి ఎంత పారితోషికం ఇమ్మంటారు అని ఆ నిర్మాణ సంస్థ అధినేత ఆ ప్రముఖ నిర్మాతను అడిగితే పారితోషికానికి ఏముంది తరువాత చూద్దాములే అని బదులు ఇచ్చాడట.
తీరా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక ఆ హీరోగారి తాతగారు మరియు ప్రముఖ నిర్మాత ఒక కోటి డిమాండ్ చేసారట. దీనితో అదిరి పోయిన ఆ స్టూడియో అధినేత మరియు ప్రముఖ నిర్మాత చెట్టి యార్ ఇక జీవితంలో తాను తెలుగు సినిమాలను తీయనని అని అనడమే కాకుండా టాలీవుడ్ హీరోల దురాశ గురించి కోలీవుడ్ లో ఇప్పటికీ తన వంతు ప్రచారాన్ని చేస్తున్నాడని ఆ పత్రిక కధనం.
ప్రతి వ్యాపార రంగంలోనూ మోసాలు ఉన్నప్పటికీ మంచి చెడుల కలయికతో ఏ రంగం అయినా ఉంటుందని అయితే తెలుగు సినిమా రంగంలో మటుకు మంచి అన్నది ఎక్కడా కనిపించకుండా కేవలం ఏ కోణంలో చూసినా చెడు మాత్రమే కనిపిస్తూ విలువలు లేకుండాపోతున్న రంగంగా టాలీవుడ్ మారిపోతోందని షాకింగ్ కామెంట్స్ చేసింది ఆ దిన పత్రిక..