భారత పురుషుల హాకీ జట్టు గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ కోసం ఒక కోటి నగదు బహుమతి ఇస్తున్నట్లు షంషీర్ వయలీల్ ప్రకటించారు. ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శనతో ప్రపంచం నలుమూలలా ఉన్న భారతీయులను శ్రీజేష్ ఆనందంతో ముంచెత్తాడని ఆయన అన్నారు. శ్రీజేష్ కి తోటి మలయాళీగా తాను గర్వపడుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. దుబాయ్ లోని VPS హెల్త్కేర్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా షంషీర్ వయలీల్ కొనసాగుతున్నారు. హెల్త్కేర్ పారిశ్రామికవేత్తగా ఆయన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.
తనకు రూ.1 కోటి రివార్డ్ ప్రకటించడంతో శ్రీజేష్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ బహుమతికి గ్రహీత కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని శ్రీజేష్ అన్నారు. 2000 కాలంలో జూనియర్ జాతీయ హాకీ జట్టులో అడుగుపెట్టిన తన ప్రతిభతో శ్రీజేష్ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. తక్కువ వ్యవధిలోనే మంచి హాకీ ప్లేయర్గా పేరు తెచ్చుకున్న అతను 2016 లో జాతీయ జట్టు కెప్టెన్గా కూడా బాధ్యతలు చేపట్టారు. టోక్యో ఒలంపిక్స్ లో గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ హాకీ టీమ్ గా నిలిచి కాంస్యం పట్టేశారు.