మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును త్వరలోనే అరెస్టు చేయబోతున్నారు. నోట్లకు ఓట్లు కేసులో మత్తయ్య ఇచ్చిన సాక్ష్యం, వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేయబోతున్నారా.. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు ఇప్పుడు రామతీర్థం ఘటనపై రాజకీయం చేస్తున్నారా.. కేంద్రానికి అనుకూలంగా ఉండేందుకే ఇప్పుడు చంద్రబాబు హఠాత్తుగా హిందూ నినాదం ఎత్తుకున్నారా.. అవునంటున్నారు వైసీపీ నేతలు..

ఓటుకు నోటు కేసు విషయంలో రానున్న కొద్ది రోజుల్లోనే చంద్రబాబును అరెస్టు చేయడం ఖాయం. జైశ్రీరాం అంటే ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా..? అని చంద్రబాబుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. మతాల మధ్య చిచ్చుపెడితే ఊరుకునే పరిస్థితి లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతాడు. అసెంబ్లీలోకి కూడా రాలేడని మంత్రి అంటున్నారు.

ఆలయాలను కూల్చే చరిత్ర, విగ్రహాలపై దాడులు చేసే చరిత్ర చంద్రబాబుదేనంటున్న మంత్రి... చంద్రబాబు ప్రెస్‌మీట్‌ చూసిన‌ తరువాత రామతీర్థంలో ఘటన వెనుక అతని పూర్తి హస్తం ఉందనే అనుమానం కలుగుతుందన్నారు. తానే కుట్ర చేసి ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. చంద్రబాబుకు దేవుడు అంటే భక్తి, భయం ఉందా..? బూట్లు వేసుకొని దేవుడి పూజలు చేస్తావా..? బూట్లు వేసుకొని పూజలు చేసే వ్యక్తి హిందువా..? హిందుత్వం తెలుసా.. ? చంద్రబాబు కంటే దుర్మార్గుడు, రాక్షసుడు ఎవరైనా ఉంటారా..? అని మంత్రి మండిపడ్డారు.

నువ్వెంత.. నీ బతుకెంత చంద్రబాబూ.. సీఎం వైయస్‌ జగన్‌కు వార్నింగ్‌ ఇస్తావా.. ఖబడ్దార్‌ ఏంటీ..? నువ్వు, నీ కొడుకు, నీ సైన్యం అంతా వచ్చినా సీఎం వైయస్‌ జగన్‌ కాలి బొటనవేలు కూడా ముట్టుకోలేరు. ప్రజల గుండెల్లో దేవుడిగా ఉన్న వ్యక్తి వైయస్‌ జగన్‌. అలాంటి నాయకుడిని పట్టుకొని ఖబడ్దార్‌ అంటూ మాట్లాడుతావా..? చంద్రబాబు చౌదరి నీకు ఎవరూ భయపడేవారు లేరు. హిందూ దేవాలయాలను కాపాడే బాధ్యత మాది అంటూ మంత్రి వెల్లంపల్లి ఘటుగా స్పందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: