గత సంవత్సరం చెన్నైలో వరద బీభత్సం మిగిల్చిన విషాదం ఇప్పటికీ మరిచిపోలేం. వంద సంవత్సరాల తర్వాత ఇంతటి విపత్తు తమిళ ప్రజలు చూశారట. తాజాగా తమిళనాడులో రైలు ప్రమాదం సంభవించింది. వేలూరు జిల్లా పనూర్చర్ చెన్నై – బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.శుక్రవారం తెల్లవారుజామున ఐలాండ్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘనటలో 100 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 4 బోగీలు పక్కకు ఒరగడంతో ఈ ప్రమాదం జరిగింది.

అయితే వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ అక్కడ ఐదు బోగీలు పట్టాల నుంచి విడిపోయి చల్లాచెదురుగా పడిపోయాడు. ప్రమాదం జరిగిన వారిలో కొందరి పరిస్థిలి చాలా దారుణంగా ఉందని వైద్యులు అంటున్నారు.

బోగీల్లో చిక్కుక్కున్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదవాతావరణం నెలకొంది. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా ఎలాంటి సహాయం అందకపోవటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: