వైకాపా అభిమానులు మరోసర్వేను ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఒక వార్తా చానల్ ,మరోసర్వే సంస్థ కలిసి చేసిన సర్వే ప్రకారం వైకాపాకు సీమాంధ్రలో భారీ స్థాయిలో సీట్లు దక్కనున్నాయని వారు అంటున్నారు. సీమాంధ్రలో జగన్ పార్టీ కనీవినీ ఎరగనువంటి స్థాయిలో విజయం సాధిస్తుందని వీరు అంటున్నారు. 175 స్థానాలున్న సీమాంధ్ర ప్రాంతంలో ఏకంగా 125 నుంచి 135 సీట్లను గెలుచుకొని వైకాపా రికార్డు సృష్టిస్తుందని అంటున్నారు. తమకు అందుబాటులో ఉన్న సర్వే వివరాల ప్రకారం... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలొ 125- 135, తెలంగాణలొ 5 నుంచి 7 అసెంబ్లీ సీట్లు, కాంగ్రెస్ పార్టీకి సీమాంధ్రలొ 5, తెలంగాణలో 20 అసెంబ్లీ సీట్లు, టీఆర్ఎస్ కు తెలంగాణలొ 60 అసెంబ్లీ సీట్లు, టిడిపికి సీమాంధ్రలొ 35 నుంచి 40, తెలంగాణలొ 15 నుంచి 18 అసెంబ్లీ సీట్లు, బిజెపి కి తెలంగాణలొ 3 నుంచి5 సీట్లు మిగిలినవి ఇతర పార్టీలకు వస్తాయని వైకాపా వాళ్లు అంటున్నారు. ఒక వార్తా సంస్థ ఈ సర్వేను చేసిందని.. అయితే అఫిషియల్ గా వివరాలను విడుదల చేయాలేదని వారు అంటున్నారు. దీంతో తమ అభిమాన పార్టీ సీమాంధ్రలో భారీ స్థాయి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి వీరి ఆశలు ఎంత మేరకు నెరవేరతాయో!

మరింత సమాచారం తెలుసుకోండి: