తెలంగాణ లో మద్యం దుకాణాల నిర్వహణకు టెండర్ల దాఖలు ప్రక్రియ కు గురువారం చివరి రోజు కావడం తో పలు చోట్ల వ్యాపారుల మధ్య గలాటాలు , తోపులాటలు చేసుకున్నాయి . మద్యం దుకాణాల నిర్వహణ కు దరఖాస్తు చేసుకునేందుకు ఈసారి పెద్ద సంఖ్యలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యాపారాలు కూడా పోటీపడి టెండర్లను దాఖలు చేశారు . ఏపీ లో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న నేపధ్యం లో , తెలంగాణ లో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వారు టెండర్ ప్రక్రియ లో పాల్గొనడం, మేడ్చల్ , మల్కాజ్ గిరి జిల్లాలో వివాదానికి దారి తీసింది.
హైదరాబాద్ నగర శివారు నాగోల్ లోని ఒక ఫంక్షన్ హాల్లో మద్యం దుకాణాల నిర్వహణ కు వ్యాపారుల నుంచి టెండర్ల స్వీకరించారు . అయితే టెండర్ల ప్రక్రియ లో పాల్గొన్న రెండు వర్గాలు తోపులాట దిగడమే కాకుండా, టెండర్లు దక్కించుకునేందుకు కొంతమంది లోకల్, నాన్ లోకల్ పేరిట విభేదాలతో సృష్టించే ప్రయత్నం చేశారు . దీనితో ఒక దశలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది . ఈ సందర్బంగా తమ ఏరియా లోకి మీరు వచ్చి ఎలా టెండర్లు దాఖలు చేస్తారంటూ కొంతమంది నాన్ లోకల్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం తో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి . దీనితో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు లోకి తీసుకువచ్చారు.
టెండర్ల పక్రియ ను మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి దగ్గర ఉండి పర్వవేక్షించడమే కాకుండా , టెండర్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులకు సూచించారు . టెండర్ల దాఖలు సందర్బంగా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు .