ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా దిశ చట్టాన్ని తీసుకువచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే శనివారం నాడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జగన్ మోహన్ రెడ్డి దిశ పోలీస్ స్టేషన్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు కొత్తగా దిశ చట్టంపై జగన్ సర్కార్ ఒక స్పెషల్ పాటను విడుదల చేసింది. మొత్తం తొమ్మిది  నిమిషాల విడిదిగల ఈ పాటలో దిశ చట్టంపై పూర్తి అవగాహన కల్పించారు. 

 

 

ఆడవారికి ఏదైనా ఆపద వస్తే ఎలా స్పందించాలో కూడా ఈ  పాటలో వివరించారు. ‘మహిళ ఓ మహిళ' అంటూ ఈ పాట మొదలవుతోంది. అంతే కాకుండా ఆడవారిపై మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మాత్రం 21 రోజుల్లో కఠిన శిక్షలు పడతాయన్న విషయాన్ని కూడా ఈ పాటలో వివరించారు. దిశ చట్టం కోసం ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రుబెన్స్ స్వరపరిచిన స్పెషల్ సాంగ్‌ ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

 

 

రాష్ట్రంలోని మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశ  పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. వీటితో మహిళలకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి భద్రత కల్పించబోతున్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలియచేశారు. రాష్ట్రంలోని మహిళలకు ఎలాంటి భద్రత కల్పించాలనే అంశంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇలా ఏర్పాటు చేసిన  దిశ పోలీస్ స్టేషన్‌ లో మొత్తం ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 38 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వీరంతా 24 గంటలూ మహిళల భద్రత కోసం పనిచేస్తారు.

 

 

అయితే దిశా చట్టం ప్రకారం అత్యాచార కేసు నమోదైనా అది కేవలం 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి సరైన సాక్ష్యాధారాలు ఉంటే దోషులకు కేసు నమోదైనప్పటి నుంచి 21 రోజుల్లో శిక్ష అమలు చెయ్యాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేస్తారు. మహిళలు, చిన్నారులపై తీవ్రమైన నేరాలకు పాల్పడితే డైరెక్టుగా ఉరిశిక్ష విధిస్తారు. సోషల్ మీడియా, ఫోన్లలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడినా, ప్రవర్తించినా వారికి రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తారు. ఇలాంటి చాలా ఆసక్తికర అంశాలు ఈ చట్టంలో పొందుపరిచారు. అందుకే దీన్ని ప్రతిపక్షం కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే కేంద్రం తాజాగా దిశ చట్టంలో కొన్ని సవరణలు చేయాలని ఆ చట్టాన్ని ఆమోదించకుండా తిరిగి పంపడం అందరికి తెలిసిన సంగతే.

మరింత సమాచారం తెలుసుకోండి: