సోషల్ మీడియాలో పరిచయం ప్రేమగా మారింది. సినిమాలను మించిన విదంగా నమ్మించాడు. చివరికి మోసానికి దిగాడు. అమెరికాలో ఉన్న యువతికి పేస్ బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు.. దాన్ని యాసెప్ట్ చేసిన పాపానికి నిలువునా దోచేశాడు. నమ్మిన పాపానికి నరకాన్ని చూపించాడు.  వివరాల్లోనికి వెళితే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న యువతీ ని ఓ మేధావి ట్రాప్ చేసాడు. అది నిజమే అనుకోని నమ్మి ఇండియా కి వచ్చిన యువతిని అతి దారుణంగా రేప్ చేసి వీడియోలను చిత్రీకరించి మరి డబ్బులు కావాలని డిమాండ్ చేశారు.

 

ఈ ఘటన బాచుపల్లిలో జరిగింది. బాచుపల్లి అత్యాచార కేసులో పోలీసులు విస్తుపోయే విషయాలను తెలుసుకొన్నారు. నిందితుడి సెల్‌ఫోన్‌లో మరికొందరి మహిళల నగ్న వీడియోలు కూడా ఉండటంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. హైద్రాబాద్‌లో ఉంటున్న మహిళ గతంలో విదేశాల్లో ఉన్న సమయంలో మామిడి సంజీవరెడ్డి పరిచయం పెంచుకొన్నాడు. ఆమె హైద్రాబాద్ కు వచ్చిన సమయంలో ఆమెను తన ఇంటికి తీసుకొచ్చారు....

 

శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.బాధితురాలిపై అత్యాచారం చేసే సమయంలో తన ఫోన్లో వీడియోలు తీసాడు. ఆ వీడియోను ఆమెకు పంపించి డబ్బులు కావాలని డిమాండ్ చేసాడు. 50 లక్షలకు పైగా ఆమె దగ్గరనుండి రాబట్టాడు. 30 తులాల బంగారాన్ని కూడా లాక్కున్నాడు ఇంకా కావాలని అడగడంతో ఆమె భరించలేక పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ మేరకు అతన్ని పట్టుకొని పోలీసులు కాస్త కర్రలకు పని పెట్టాడు.

 

నిందితుడి ఫోన్‌లో పలువురు యువతుల పోన్ నెంబర్లు లభించాయి. అంతేకాదు వీడియోలు,ఫోటోలను కూడ పోలీసులు గు ర్తించారు. ఈ ముగ్గురి బారిన మరికొందరు యువతులు పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.నిందితుడి వద్ద తుపాకీ, బాధిత మహిళకు చెందిన ఓ చెక్ బుక్, డెబిట్, క్రెడిట్ కార్డులు కూడ దొరికాయి.సోషల్ మీడియా ద్వారా వచ్చే ఇలాంటి వాటి వల్ల మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: