కృష్ణా జిల్లా లో దారుణం వెలుగు చూసింది. తమపడక గది లో ఉన్నపుడు కెమెరాల తో చిత్రీకరంచారని ఓ మహిళా ఆవేదన వ్యక్తం చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు యువకులు భార్యాభర్తల పడక గది వీడియోలు చిత్రీకరించి, వాటిని చూపించి బ్లాక్‌మెయిల్‌ కు దిగారు. భారీ మొత్తం లో డబ్బు డిమాండ్ చేయడం ప్రారంభించారు. దీంతో దిక్కుతోచని భార్యా భర్తలు చివరకు పోలీసులను ఆశ్రయించారు.  విచారణ లో పోలీసులు చెప్పిన నిజాలను విని భార్య భర్తలు షాక్ అయ్యారు. 

 

 

కృష్ణా జిల్లా గుడివాడ కు చెందిన భార్యా భర్తలు పడకగదిలో ని వ్యక్తిగత దృశ్యాల ను అట్లూరి రఘు, షేక్‌ అన్వర్‌ అనే యువకులు రహస్యం గా చిత్రీకరించారు. తర్వాత వాటిని ఆ దంపతుల కు చూపించి తమ మాట వినక పోతే బయటపెడతామని బెదిరించారు. వీటితో వారిని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసారు. 

 

 


రోజు రోజుకు వారి ఆగడాలు ఎక్కువవడంతో విసిగి పోయిన భార్యాభర్తలు చివరకు పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి గుడివాడ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పుకున్నారు. జిల్లా ఎస్పీ అందించిన వివరాల ప్రకారం వారిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ కింద కేసును నమోదు చేయనున్నట్లు సమాచారం.. 

 

 


అట్లూరి రఘు, షేక్‌ అన్వర్‌ ఆ ప్రాంతానికి చెందిన వారేనని తెలుస్తోంది. వీరు మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దురాగతాలకు పాల్పడుతారని సమాచారం. వ్యక్తిగత వీడియోలను రహస్యంగా చిత్రీకరించి వాటితో వేధింపులకు పాల్పడుతారని, బ్లాక్‌మెయిల్‌కు దిగి డబ్బు లాగుతున్నారని తెలుస్తుంది. అయితే, ఈ విషయం పై చుట్టుపక్కల వాళ్ళు మండిపడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: