జగన్ పాలన అద్భుతంగా ఉండటంతో లోపాలు లేక టీడీపీ దుష్ప్రచారానికి ఒడిగడుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ తీరు చూస్తుంటే.. దొంగే మళ్లీ దొంగా.. దొంగా అని అరుస్తున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కష్టాల్లో ఉన్నా.. ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే జగన్ రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేస్తున్నారుని సజ్జల కితాబిచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌ చేసే పనిలో నిజాయితీ, నిబద్ధత, తపన ఉన్నాయి. అందుకే అతితక్కువ కాలంలోనే గొప్ప సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

 

 

ఏ పథకం మీద ప్రభుత్వంపై బురదజల్లేందుకు వీలులేకపోవడంతో.. ఏదో ఒకటి క్రియేట్‌ చేసి ప్రతిపక్షం, చంద్రబాబు అనుకూలమీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని సజ్జల విమర్శించారు. బీసీలపై ప్రేమ లేక వైయస్‌ఆర్‌ సీపీ సుప్రీం కోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం లేదని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. బీసీల రిజర్వేషన్‌ను అడ్డుకున్న పార్టీనే.. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీని గెలిపిస్తాయని సీఎం వైయస్‌ జగన్‌ పరిపూర్ణంగా నమ్ముతున్నారు. కిందిస్థాయిలో కూడా పార్టీని గెలిపించుకోగలిగితే ప్రజలకు వద్దకు పాలన అనే సీఎం ఆలోచన నెరవేరుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

 

 

రాష్ట్రంలో తొమ్మిది నెలలుగా సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో అద్బుతమైన పాలన సాగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. సంక్షేమం, అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయకుండా ముందుకు జగన్ సాగుతున్నారని ఆయన వివరించారు. తొమ్మిది నెలలుగా సీఎం చేసిన మంచి పనులే పంచాయతీ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

తొమ్మిది నెలలుగా ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మేనిఫెస్టోలో పెట్టి 90 శాతం పైగా అమలు చేశామని... అంతకు మించి అవసరాన్ని బట్టి చేసుకుంటూ వచ్చిన చర్యలన్నీ ప్రజల ముందుంచి ఆశీస్సులు కోరుతామని సజ్జల అన్నారు. ఎవరు, పార్టీ అనేది చూడకుండా మద్యం, డబ్బు పంచే వారిపై వెంటనే కేస్‌ బుక్‌ చేయాలని మంత్రులు, పోలీసులు, కలెక్టర్లను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించిన విషయాన్ని సజ్జల గుర్తు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: