ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. హాయిగా గడిచిపోతున్న  జీవితంలోకి మూడో వ్యక్తి ప్రవేశించడంతో... అక్రమ సంబంధాలకు తెరలేపుతున్నారు... కట్టుకున్న వారిని మోసం చేస్తూ ఆ మూడో వ్యక్తి తో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రస్తుతం ఎన్నో హత్యలకు ఆత్మహత్యలకు కూడా కారణమవుతున్నాయి. తాజాగా ఇలాంటిదే జరిగింది కర్నూలు జిల్లాలో. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం లో కుంకనూరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన యువకుడి హత్య ఉదంతం తాజాగా ఓ కొలిక్కి వచ్చింది. తన భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడన్న  కోపంతోనే ఆ మహిళ భర్త ఆ యువకుడిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.  

 

 

 వివరాల్లోకి వెళితే... ఎమ్మిగనూర్ కు చెందిన ఓ మహిళకు కుంకనూరు బెస్త బాలరాజు అనే వ్యక్తి తో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామానికి చెందిన బెస్త బడేసాబ్ అనే వ్యక్తికి కుంకునూరు  గ్రామానికి చెందిన మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలోనే తరచూ బడేసాబ్ అనే వ్యక్తి అత్తగారి గ్రామమైన కుంకునూరు  వచ్చి వెళ్తుండేవాడు. ఇక బెస్త బడేసాబ్ కు బాలరాజు భార్య దూరపు బంధువు. దీంతో బడేసాబ్ అత్తగారింటికి వచ్చినప్పుడల్లా బాలరాజు భార్యను పలకరిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చనువు పెరిగింది... ఆ చనువు కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. సుమారు ఐదేళ్లుగా వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. 

 

 

బాలరాజు పని నిమిత్తం బయటకు వెళ్ళినప్పుడు  భార్య ప్రియుడు బడేసాబ్ కు కబురు పెట్టి ఇంటికి పిలిపించుకునేది.  ఈ క్రమంలోనే భర్త పని నిమిత్తం బయటకు వెళ్ళగా తన ప్రియుడు బడేసాబ్ పిలిపించుకుంది భార్య. ఇక భర్త త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి రాగా ప్రియుడితో నగ్నంగా అసభ్య రీతిలో ఉండడానికి కళ్ళారా చూసి ఆవేశం పట్టలేక పోయాడు భర్త  బాల రాజు. ఇక ఇది గమనించిన బడేసాబ్ ఇంటి నుంచి బయటకు పారిపోవడాన్ని  గమనించి తలపై కత్తిపీట తో విచక్షణ రహితంగా దాడి చేశాడు.. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బడేసాబ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే భార్య భర్త ఇద్దరూ కలిసి ప్లాన్ ప్రకారమే తన కొడుకును హత్య చేశారని ఆరోపణలు చేస్తున్నాడు బడేసాబ్ తండ్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: