ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది.. అదేంటంటే జన సాంద్రత ఎక్కువగా కనిపించకుండా చేయాలనే ఆలోచనలో ఉన్నారు.. లాక్ డౌన్ విధించి ప్రజలను ఇళ్లకే పరిమితమయ్యే లా చేశారు..



 

 

అసలు విషయానికొస్తే ఓ వ్యక్తి ఉమ్ము వేశాడు.. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.. అదేంటంటే ఉమ్ము వేశాడు అడ్డంగా దొరికిపోయాడు.. అలా దొరికిన అతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ముద్దాయి కావడంతో అతన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. వివరాల్లోకి వెళితే అతడో కిరాయి హంతకుడు. సుపారీ తీసుకుని హత్యలు చేస్తుంటాడు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడి కోసం పోలీసులు ఎంతో కాలంగా గాలిస్తున్నారు. అనూహ్యంగా బహిరంగంగా ఉమ్మేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాము వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్అతడేనని తెలిసి అవాక్కయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కర్ణాటకలోని హుబ్బళ్లి నగరంలోని నేకార నగరలో జరిగింది. నిందితుడిని సలీం బళ్లారిగా గుర్తించారు..




 

 

ఇటీవల కలబురగిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సలీంను ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సలీం శుక్రవారం రాత్రి పీకలదాకా తాగి ఓ హోటల్‌ యజమానితో ఘర్షణపడ్డాడు. భోజనం పెట్టలేదని ఉమ్మేసి రచ్చ చేశాడు.. కరోనా వైరస్‌ భయంతో బహిరంగంగా ఉమ్మి వేయడం నేరం కావడంతో వెంటనే పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు తాము గాలిస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సలీం బళ్లారి అని తెలుసుకుని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సలీం కలబురిగి హత్యతో పాటు అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: