నాలుగు రోజుల క్రితం పెళ్లి జరిగిన ఇంట్లోనే ఇప్పుడు విషాదం నెలకొంది. కూతురి మెడలో తాళి పడిన నాలుగు రోజులకే తల్లి మెడలో తాళి తెగిపోయింది. విచిత్రం ఏంటంటే.. ఆ తాళిని తెంపుకున్నది స్వయంగా ఆ తల్లే.. అంటే పెళ్లి కూతురి తల్లే స్వయంగా తన భర్తను కత్తితో పొడిచి చంపేసింది. అసలు కూతురు పెళ్లి జరగడం ఏంటి.. తల్లి తన భర్తను చంపడమేంటి... అంతా షాకింగ్ గా ఉంది కదా.

 

 

ఇలాంటి విషాద ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గురంధరపాలెంలో వ్యవసాయ కూలీ విసారపు చిరంజీవి (48), సన్యాసమ్మ (40)

దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశారు. చిన్నమ్మాయిని ఈనెల 3న మాకవరపాలెం మండలం పైడిపాలకు చెందిన అడ్డూరి చంటబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు అయిపోయాయి.. తమ బాధ్యతలు తీరిపోయాయని అనుకునే సమయంలోనే.... అనూహ్యంగా కొత్తల్లుడి కుల వివాదం సమస్యగా మారింది.

 

 

పెళ్లి జరిగిన నాలుగు రోజుల తర్వాత కొత్త అల్లుడు తమ కులం వాడు కాదని తెలిసింది.

ఈనెల 11న పెద్దలతో పంచాయితీ జరిగింది. కుల ధ్రువీకరణ పత్రం కోసం అల్లుడి కుటుంబ సభ్యులను అడిగారు. కానీ వాళ్లు దాన్ని చూపించలేకపోయారు. దీంతో తమ పరువు పోయిందని భార్యాభర్తలు ఆందోళన చెందుతున్నారు. అల్లుడి కుల వివాదం ఇటు చిరంజీవి దంపతుల మధ్య గొడవకు దారి తీసింది.

 

 

కూతురి జీవితం ఇలా అయినందుకు నువ్వు కారణం అంటే నువ్వే అంటూ గొడవ పడ్డారు. ఈనెల 15న పొలం వద్ద జరిగిన గొడవలో భార్య సన్యాసమ్మ కత్తితో భర్తపై దాడి చేసింది. ఆయన అక్కడే మరణించాడు. క్షణికావేశంలో హత్య చేసిన సన్యాసమ్మ ఆ తర్వాత కత్తిని అక్కడే పడేసి, రక్తపు మరకలను శుభ్రం చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది. తన భర్త హత్యకు గురైనట్టు ముందు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత.. తానే హంతకురాలినంటూ లొంగిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: