ప్రస్తుతం ఆర్మేనియా అజర్బైజాన్ దేశాల మధ్య తీవ్రస్థాయి లో యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. భూభాగం పై  ఆధిపత్యం కోసం జరుగుతున్న యుద్ధం రోజు రోజుకు మరింత ఉద్రిక్త పరిస్థితుల కు దారి తీస్తుంది. ఇప్పటికే ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య జరుగుతున్న యుద్ధం లో ఎంతోమంది సైనికులు వీరమరణం పొందారు. ఎన్నో యుద్ధ విమానాలు కూలి పోయాయి యుద్ధ ట్యాంకులు ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఆర్మేనియా కు చెందిన ఒక వర్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అజర్బైజాన్ దేశం టర్కీ పాకిస్థాన్ దేశాల అండతో  ప్రస్తుతం యుద్ధం  చేస్తోంది.



 అదే సమయం లో ఆర్మేనియా దేశం వెనుక ఫ్రాన్స్  భారత్ దేశాలు అండగా నిలబడేందుకు సిద్ధమవుతున్నాయి. రష్యా దేశం అయితే ఏకంగా తన సైనికుల ను అజర్బైజాన్ తో చేస్తున్న యుద్ధంలో ఆర్మేనియా తరపున యుద్ధంలో నిలబెట్టేందుకు సిద్ధం అయ్యింది. ఇలా రోజురోజుకు ఆర్మేనియా అజర్బైజాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం గా మారిపోతుంది. అయితే ఇటీవల మోడీ రంగంలోకి దిగడంతో ఇజ్రాయిల్ దేశం అజర్బైజాన్ దేశానికి భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అజర్బైజాన్ దేశం కీలక ఆయుధాలను  మొత్తం ఇజ్రాయిల్  నుంచి కొనుగోలు చేస్తూ ఉంటుంది.



 ప్రస్తుతం అజర్బైజాన్ యుద్ధంలో ఉపయోగిస్తున్న ఆయుధాలు కూడా ఇజ్రాయిల్ నుంచి కోనుగోలు  చేసినవే కావడం గమనార్హం. ఇక ఇప్పుడు యుద్ధ సమయంలో కూడా అజర్బైజాన్ దేశానికి ఇజ్రాయిల్ మరిన్ని ఆయుధాలను అందిస్తుంది. ఇలాంటి క్రమంలో రంగంలోకి దిగిన మోడీ మిత్ర దేశమైన ఇజ్రాయిల్ తో చర్చించడంతో వెంటనే కీలక నిర్ణయం తీసుకున్న ఇజ్రాయిల్  అజర్బైజాన్ కు ఆయుధాల పంపిణి ఆపివేయడానికి నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం రోజురోజుకు యుద్ధం  తీవ్రస్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఇజ్రాయిల్  ఆయుధాల పంపిణీ ఆగిపోవడం అజర్బైజాన్ దేశానికి భారీ షాక్  చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: