ఏకంగా నరేంద్ర మోడీ విమర్శలు అన్నింటినీ జయించి ప్రధానమంత్రి స్థానంలోకి ఎదిగారూ. ప్రస్తుతం ఇలాంటి ప్రచారమే జరుగుతోంది అమెరికాలో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కూడా ఇటువంటి తరహా ప్రచారం ప్రస్తుతం మొదలు పెట్టాయి అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలు. మోడీ తరహాలోనే ప్రస్తుతం ట్రంప్ కూడా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అమెరికా లో ఉన్నటువంటి న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రస్తుతం ట్రంపు ని టార్గెట్ చేస్తూ ఎన్నో విమర్శలు చేస్తున్నట్లు ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్నారు.
2012 తర్వాత షాంఘైలో కార్యాలయాన్ని తెరిచి అక్కడే లక్షా 92 వేల డాలర్లకు పైగా పెట్టుబడిగా పెట్టారని.. అమెరికాలో మాత్రం కేవలం 97 వేల 400 డాలర్లు మాత్రమే పెట్టుబడిగా పెట్టారని.. ఎన్నో కథనాలు ప్రచురితం చేసింది అక్కడి ఓ పత్రిక. దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే వ్యాపారస్తుడు అన్న తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. అయితే ట్రంప్ ను అత్యవసరంగా గద్దె దిగిపోయి వెంటనే జో బైడెన్ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతోనే అక్కడి పత్రికలు ఇలాంటి తరహా ప్రచారం చేస్తున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు.