రోజు రోజుకు తన మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఎప్పుడు ఎవరు దాడి చేసి ప్రాణాలు తీస్తారో  అని అనుక్షణం భయపడుతూ బ్రతికే పరిస్థితి ఏర్పడింది నేటి రోజుల్లో చిన్నచిన్న కారణాలకే ఏకంగా దారుణంగా హత్య చేసేందుకు కూడా వెనకాడడం లేదు మానవత్వం ఉన్న మనుషులు కరువు అవుతున్న నేటి రోజుల్లో ఉన్మాదులు గా మారుతున్న మనుషుల ఎక్కువ అవుతున్నారు వేసి రోజురోజుకు ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అనే విషయం తెలిసిందే. దారుణ హత్యలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తి  తండ్రి కూతురు పై దారుణంగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా కలకలం సృష్టించింది. బాధితులు పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకునేలోపే ఇక వారిపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు ఈ ఘటన స్థానికంగా అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేసింది తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఘటనలో తీవ్రంగా గాయపడిన సీతారామయ్య శంఖవరం మండలం నెల్లిపూడి అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.




 అయితే శంకరయ్య తన కూతురు ధనశ్రీ భార్య కూడా రాత్రి సమయంలో భోజనం చేసి పడుకున్నారు. ఈ  క్రమంలోనే అర్ధరాత్రి సమయంలో ఎవరో తలుపు కొట్టారు దీంతో అనుమానంతో  తలుపు తీశాడు శంకరయ్య. ఇక తలుపు తీయడం తీయడమే ముఖానికి రంగు పూసుకొని వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా ఉపాధ్యాయుడిపై దారుణంగా దాడికి దిగాడు. రాడ్ తో దాడి చేశాడు. ఇంతలో అడ్డుకోబోయిన కుమార్తె ధనశ్రీ పై కూడా దుండగుడు దాడి చేయడంతో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.  పక్కనే ఉన్న భార్య బయటకు పరుగులు పెట్టి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితులు ఇద్దరు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: