ఈ మధ్యకాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అప్పటి వరకు మంచి వారిగా  ఉన్న వారు ఎవరూ లేని సమయం చూసివారి నిజస్వరూపం బయట పెడుతున్నారు. ఇలా నమ్మకంగా ఉన్న వారు ఏకంగా ఇళ్లల్లో చోరీకి పాల్పడుతు.. భారీ షాక్ ఇస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే దొంగల బెడద భారీగా పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా దొంగలు ఇంటిని గుల్ల చేస్తున్నారు. ఇంటికి తాళం కనిపించింది అంటే చాలు ఇక తిరిగి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు ఉంటాయా ఉండవా అన్న అనుమానం కూడా నేటి రోజుల్లో కలుగుతుంది.



 ఇలా రోజురోజుకు దొంగల బెడద ఎక్కువ అవుతోంది. కొంతమంది ఇంట్లో పనివాడిగా చేరి నమ్మకం గా మారిన తర్వాత సరైన సమయం చూసి అందిన కాడికి దోచుకో పోతూ ఉంటే.. మరికొంతమంది ఇంటి పక్కనే ఉంటూ ఎంతో నమ్మకంగా ఉండి చివరికి సరైన సమయం కోసం చూసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇంటి యజమానులకు భారీ షాక్ తగులుతుంది. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది.  ఇంటి పక్కన ఉన్న వ్యక్తే ఏకంగా దొంగతనానికి పాల్పడడంతో ఇంటి యజమానులు షాక్  కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 కానీ ఆ దొంగ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి గా మారిపోయింది పరిస్థితి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పద్మా నగర్ లో చోటు చేసుకుంది. దొంగను గుర్తించిన స్థానికులు దేహశుద్ధి చేశారు.  ఇంటి పక్కన ఉండే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో  ఇంట్లోకి ఎంతో రహస్యంగా వెళ్లి బీరువాలో ఉన్న ఏడు లక్షల నగదును అపహరించాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకున్నారు.  స్థానికులను  పిలవడంతో అందరూ కలిసి అతనికి దేహశుద్ధి చేసి చివరికి పోలీసులకు అప్పగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: