హ్యాకర్లు ఎవరోకరి సోషల్ మీడియా అకౌంట్లను లేదా పర్సనల్ బ్యాంక్ హ్యాక్ చేసి అవతలి వారి పర్సనల్ విషయాలను బహిర్గతం చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు వాడుతుంటారు. ముఖ్యంగా సినీ తారలు, రాజకీయ నాయకుల సోషల్ మీడియాను ఎక్కువగా హ్యాక్ చేస్తుంటారు. ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తారు. మధ్య కాలంలో సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ వరుసగా హ్యాక్ అవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. బాలీవుడ్ నటి ఇషా డియోల్, అమీషా పటేల్, వరలక్ష్మీ శరత్ కుమార్, మంచు మనోజ్, లాస్య ఇలా చాలా మంది సెలబ్రిటీల అకౌంట్స్ హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.. వారందరూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.



పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకున్నా కూడా హ్యాకర్లు ఇదే విధంగా చేస్తున్నారు. ఇటీవల ఓ సెలబ్రెటీ అకౌంట్ ను హ్యక్ చేశారు. ఆ విషయం పై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు. దాంతో ఆమె అకౌంట్ ను బ్లాక్ చేసింది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో సెలెబ్రెటికీ అదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఈ జాబితా లో బాలీవుడ్ నటి టబు చేరింది. నా అకౌంట్‌ హ్యాక్‌ అయింది. అందులో కనిపించే మెసేజ్‌లను, పోస్ట్‌లను పట్టించుకోవద్దు అంటూ పేర్కొంది. 



ఒకప్పుడు తన అంద చందాల తో అలరించిన టబు రీసెంట్‌గా అల వైకుంఠపురములో చిత్రంలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. టబు చాన్నాళ్ళ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే సరికి ఆమెను చూసిన అభిమానులు ముగ్దులయ్యారు. 90ల కాలంలో హీరోయిన్‌గా అలరించిన టబు ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తుంది.. ఇప్పుడు వరుస సినిమాల లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ విషయం పై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలను తెలుసుకొనే ప్రయత్నం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: