వామ్మో చిరుత అని ఒకప్పుడు భయపడే వాళ్ళు.. ఎందుకంటే అది క్రూర మృగం.. ఆ జంతువుకు ఆకలి వేస్తే కంటి ముందు ఉన్నది ఎవరైనా సరే చూడదు.. ఆకలి తీరిందా లేదా అని మాత్రమే చూస్తుంది.అందుకే ఎక్కడైనా ఆ జంతువు కనిపిస్తే జనాలు భయంతో గజ గజ వణికి పోతారు. అసలు విషయాని కొస్తే ఇప్పుడు కొందరు వ్యక్తులు మాత్రం చిరుతను పట్టుకొని చంపి , ఏకంగా వండుకొని తిన్నారు.. ఈ ఘటన ప్రస్తుతం కలచివేస్తుంది. 



వివరాల్లోకి వెళితే... చిరుత పులిని బంధించి, వధించి, చంపి దాని మాంసాన్ని వండుకుని తిన్న ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 74 ఏండ్ల కురియాకోస్, 45 ఏండ్ల వినోద్‌ కలిసి మునిపారా అటవీ సమీపం లోని మంకులర్‌ లో ట్రాప్‌ వేయగా బుధవారం ఒక చిరుత పులి చిక్కింది. దీంతో దానిని బంధించి వినోద్‌ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆ చిరుతను చంపి మాంసాన్ని వండుకుని తిన్నారు. 54 ఏండ్ల సాలి కుంజప్పన్, 50 ఏండ్ల సీఎస్‌ బిను, 50 ఏండ్ల విన్సెట్ దీనికి సహకరించారు.



ఇకపోతే ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలిసిపోయింది. శుక్రవారం వినోద్‌ ఇంట్లో తనిఖీ చేయగా పది కేజీల చిరుత మాంసంతోపాటు దాని చర్మం, గోర్లు, పంటి భాగాలు లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు.ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా తన మేకను చిరుత చంపి తినడం తోనే దానిని బంధించామని మేక చనిపోయిందనే భాదలో చిరుత పై కోపంతో చంపేసామని వారు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. కూర మృగాన్ని చంపిన వారికి క్రూరంగా శిక్షలు వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: