మహిళల పై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్నో కఠిన చట్టాలని  తీసుకొచ్చారు.. అంతే కాదు న్యాయ స్థానాలు మహిళల పై అత్యా చారం చేస్తే ఉరి శిక్షలు కూడా విధిస్తున్నాయి. ఇక పోలీసులు అయితే మహిళ పై అత్యా చారం చేస్తే ఎన్కౌంటర్ చేసి మరీ దారుణం గా చంపేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మహిళలకు దేశంలో రక్షణ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది అయితే ఇంత దారుణమైన కఠినమైన శిక్షలు విధిస్తూ ఉన్నప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు.


 రోజు రోజుకు రెచ్చిపోతున్న కామాంధులు మహిళల పై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు మానవ మృగాలు గా మారి పోతున్న మానవత్వం లేని మనుషులు పశువుల్లా  మీద పడి పోయి కామ వాంఛ తీర్చుకుంటున్నారు. అంతటితో ఆగకుండా దారుణం గా హత్యలకు సైతం పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసింది. అర్ధరాత్రి ఆడది నడిరోడ్డు పై తిరిగినప్పుడు దేశానికి అసలు సిసలైన స్వాతంత్రం వచ్చింది అని అన్నారు గాంధీజీ.


 కానీ నేటి రోజుల్లో మాత్రం ఆడది అర్ధరాత్రి కాదు పట్ట పగలు కూడా నడి రోడ్డుపై ధైర్యం గా తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే మరో దారుణ హత్య ఘటన వెలుగు లోకి వచ్చింది. దుండగులు మహిళ పై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  నోట్లో గుడ్డలు కుక్కి మరి అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారు. మృతురాలు 38 ఏళ్ల వ్యవసాయ కూలీ గా గుర్తించారు పోలీసులు. ఇక మహిళను హత్య చేసిన అనంతరం అలంపల్లి రైల్వే ట్రాక్ పై  మృతదేహాన్ని పడేసి పరారయ్యారు దుండగులు. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వారి వివరాలు సేకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: