ఇక గతంలో కూడా మనం చూసే ఉంటాము. ఎన్నో రకాలుగా ప్రజలు మోసపోయారు. ఇప్పటికి మోస పోతుంటారు. ఇక చాలా మంది ఇప్పుడు తమ డబ్బుని పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికి బ్యాంక్ నుంచి తమ డబ్బులు పోతున్నాయని చాలా మంది మోసపోతూ చెప్తూ ఉంటారు. దానికి కారణం తమ బ్యాంక్ కి సంబంధించిన వివరాలు, సమాచారం ఇతరులకు చెబుతూ ఉంటారు. అలా చెప్పడం కూడా చాలా ప్రమాదం అనే చెప్పాలి. ఇక దారిలో ఎవరైనా కేవైసీ చేయించుకొండని గాని ఫోన్లలో బ్యాంక్ తరపున కాల్స్ చేసినట్లుగా ఫోన్ చేసి బ్యాంక్ కి సంబంధించిన వివరాలు అలాగే ఏటియం కార్డు నెంబర్లు, పాన్ కార్డు నెంబర్లు అడిగినప్పుడు కొంతమంది డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. ఇలా సమాచారం ఇవ్వడం వలన తమ డబ్బు పోతుంది. దీనికి చాలా మంది బ్యాంక్ కి వెళ్లి అక్కడ బ్యాంక్ వాళ్ళని తమ డబ్బులు గురించి అడుగుతూ ఉంటారు. కాని బ్యాంక్ వాళ్లకి దీనికి ఎలాంటి సంబంధం లేదని చట్టం వచ్చింది. తమ డీటెయిల్స్ చెప్పడం చెప్పకపోవడం అది పూర్తిగా తమ బాధ్యాతేనని ఇందుకు బ్యాంక్ వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి