ప్రస్తుతం భారతదేశమంతా కరోనా ఉధృతి కొనసాగుతుంటే...మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజకీయ ప్రతీకార చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో వైసీపీ నాయకులపై ఏ విధంగా అయితే టీడీపీ కక్షపూరితంగా కేసులు పెట్టి, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతీకారానికి బదులు తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ కి చెందిన మాజీ మంత్రులపై మరియు ఎమ్మెల్యేలపై కేసులు పెట్టడం జరిగింది. రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే మరియు సంగం డైరీ చైర్మన్ అయినటువంటి ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టుపై టీడీపీ నాయకులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ "ఏసీబీ మరియు సిఐడి సంస్థలు స్వతంత్ర ప్రతి పత్తి కలిగినవని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఈ రెండు సంస్థలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా వింటున్నాయని, అలా కాకుండా తమ స్వంతంగా విచక్షణ ఉపయోగించి కార్యకలాపాలు కొనసాగించాలని, ఈ రెండు సంస్థల పెద్దలకు ఉపదేశం చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్ లో హాస్యాన్ని పండిస్తున్నాయి. ఈ విషయంపై కొంత మంది రాజకీయ విశ్లేషకులు ఈ విధంగా అంటున్నారు. గతంలో ఒక మంత్రిగా పనిచేసిన అయ్యన్నపాత్రుడికి ఏసీబీ మరియు సి ఐ డి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంలో భాగమే అని తెలియకపోవడం హాస్యాస్పదమని విమర్శిస్తున్నారు.

మరియు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా ఇలాంటి సంస్థలు వ్యవహరించడం సాధారణమే అని ఈయన పైన పంచ్ లు వేస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి సంస్థలను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్న సందర్భాలను గుర్తు చేస్తున్నారు. దీనితో ఇకనైనా ఇలాంటి అధికారిక విషయాలపై మాట్లాడే ముందు పూర్తి వివరాలను తెలుసుకుని మాట్లాడాలని ఛలోక్తులు విసురుతున్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: