కరోనా ఒకసారి వచ్చిందా? అయితే మీకు మళ్లీ కరోనా సోకే సూచనలు తక్కువే.. వ్యాక్సిన్‌ ఒక్క డోస్‌ సరిపోతుంది. విదేశీ శాస్త్రవేత్తలు చేసిన పలు అధ్యయనాల్లో ఇదే తేలింది. వైరస్‌ను జయించినవాళ్ల శరీరంలో యాంటిబాడీలు చురుకుగా పనిచేస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలయ్యాక అమెరికాలో అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. కరోనా సోకిన, సోకనివాళ్లపై టీకాల ప్రభావాన్ని అమెరికాలోని పెన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ అధ్యయనం చేసింది. వాటి వివరాలను గత వారం సైన్స్‌ ఇమ్యూనాలజీ మ్యాగజైన్‌లో ప్రచురించారు.


ఈ మేరకు వారికి రెండో డోస్ ఇచ్చి అనేక పరిశోధనలు చేశారు. కానీ, పెద్దగా మార్పు కనిపించలేదు.. దీంతో రెండో డోస్ అవసరం లేదని తేల్చి చెప్పారు..సెకండ్‌ వేవ్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న భారత్‌లో పరిశోధనలు చాలా అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. వ్యాక్సిన్‌ కొరత ఉన్నందున కరోనా వచ్చిపోయిన వాళ్లలో మొదటి డోస్‌, రెండో డోస్‌ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. దేశంలో ఇప్పటికే లక్షలమంది రికవర్‌ అయ్యారు. ఆరోగ్య శాఖ, లేదా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ ఈ దిశగా అధ్యయనాలు నిర్వహిస్తే.. కోలుకున్నవారికి ఒకే డోస్‌ ఇస్తే ఎక్కువ మందికి కరోనా ఇచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు..


యాంటిబాడీల్లో మొదటిది టీ కిల్లర్‌ సెల్స్‌, రెండోది మెమొరీ బీ సెల్స్‌. టీ కిల్లర్స్‌ సెల్స్‌ వైరస్‌ను చంపే పనిచేస్తే, మెమొరీ బీ సెల్స్‌ భవిష్యత్తులో వైరస్‌ మళ్లీ విజృంభిస్తే దాన్ని పసిగట్టి ఇమ్యూన్‌ సిస్టమ్‌ను అలర్ట్‌ చేస్తుంది. కిల్లర్ సేల్స్ వైరస్ ను నాశనం చేస్తాయి. కరోనాను జయించినవారికి ఒకే డోస్‌ సరిపోతుందన్న అధ్యయనాలతో ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇటలీ, జర్మనీ తదితర దేశాలు తమ వ్యాక్సినేషన్‌ వ్యూహాన్ని మార్చుకొని ఒకే డోస్‌తో సరిపెడుతున్నాయి.. ఇక ఇజ్రాయిల్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. వైరస్ వచ్చి పోయిన వారికి ఒక డోస్ ఇస్తున్నట్లు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: