తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేరు గిన్నిస్ బుక్‌లోకి ఎక్కడం ఖాయమట. ఈ మాట అంటున్నది పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎందుకో తెలుసా.. ఇటీవల కేసీఆర్ తాను ఎప్పుడూ మాట తప్పలేదని వ్యాఖ్యానించారు. దీన్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. అబద్ధాలు మాట్లాడే విషయంలో  కేసీఆర్ గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కుతారని సెటైర్లు వేస్తున్నారు. షాద్ నగర్ లో జరిగిన సమావేశంలో  రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను ఆయన గుర్తు చేశారు.


నాలుగు నెలలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి.. 7 ఏళ్ళు అయ్యింది ఇచ్చారా..   ఇది అబద్ధం కాదా.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు.. ఇచ్చారా..  అది అబద్ధం కాదా.. అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి వాటిని విద్య, ఉద్యోగాలలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. టిఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని.. బీజేపీకి అన్ని అంశాలలో టిఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని అన్నారు.


ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని... నిజాం కాలంలోనే  హైదరాబాద్ లో చార్మినార్ నిర్మించారన్నారు రేవంత్ రెడ్డి. 110 ఏళ్ల కింద భారీ వర్షాలు వస్తే హైదరాబాద్ లో కాలువలు నిర్మించారని.. హైదరాబాద్ లో వరదలు వస్తే కేసీఆర్, కేటీఆర్ వరదలు అరికట్టలేకపోయారని.. వరదల్లో మునిగిపోయిన కుటుంబాలకు 10 వేలు ఇస్తానని మోసం చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కి ఓటు ఇస్తే.. జాతీయ స్థాయిలో మీ కోసం కొట్లాడుతామని.. నా మీద 108 కేసులు పెట్టారు. భయపడేది లేదు.. మీ కోసం కొట్లాడుతామని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి.

మీ కోసం ప్రాణాలిచ్చి అయినా పనులు చేస్తా.. హైదరాబాద్ లో అనేక వైద్య కళాశాలలు, విద్యాలయాలు నిజాం సర్కార్ నిర్మించింది. అనేక నీటి ప్రాజెక్టులు నిజాం కట్టారు. ముస్లిముల  హక్కుల కోసం కొట్లాడే వాళ్ల వెంట తాము ఉంటామని.. కాంగ్రెస్ ఒక అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు.  తెలంగాణలో.. ఢిల్లీలో.. కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామన్నారు రేవంత్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: