కీలకమైన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇన్ చార్జ్ లు లేకుండా ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జ్లను నియమిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఏలూరు లో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మరణం తర్వాత అక్కడ పగ్గాలు ఆయన సోదరుడు బడేటి చంటికి ఇవ్వగా.. ఆయన అక్కడ పార్టీని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ కొత్త ఇన్చార్జ్గా వచ్చిన వలవల బాబ్జీ అక్కడ అసలు పార్టీని గాడిలో పెడతారా ? అన్న సందేహాలు ఉండేవి. అయితే ఆయన జనసేన తో కలిసి స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఫీచమణిచారు.
నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పార్టీని నడిపించ లేకపోతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ క్షత్రియ వర్గానికి చెందిన నీటి సంఘం ప్రెసిడెంట్ రామరాజుకు పార్టీ పగ్గాలు ఇచ్చింది. అక్కడ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద రాజు ఉన్నారు. ఈ కోణంలోనే అదే వర్గానికి చెందిన రామరాజుకు పార్టీ పగ్గాలు ఇచ్చింది. ఇక కొవ్వూరులో ఇప్పటి వరకు ఎవ్వరూ ఇన్ చార్జ్ లేకపోయినా అక్కడ మాజీ మంత్రి కెఎస్. జవహర్కు పార్టీ పగ్గాలు ఇవ్వడం దాదాపు ఖరారు కానుంది.
ఇక మరో ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం అయిన చింతలపూడి పార్టీ పగ్గాల కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. మరి వీరిలో ఎవరికి బాబు చోటు ఇస్తారో ? చూడాలి.