వరద ప్రవాహం దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణీ ప్రభావంతో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. వాతావరణ శాఖ అధికారుల అంచనాలకు మించి వర్షాలు కురుస్తుండటంతో... పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తేయాకు తోటలు, పర్వత శ్రేణులు ఎక్కువగా ఉండే కొట్టాయం, ఇడుక్కి, పథనం థిట్ట జిల్లాల్లో ఇప్పటికే రికార్డు వర్షపాతం నమోదవుతోంది. వరద ప్రభావంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగిపోయాయి. అళప్పుజ, ఎర్నాకుళం, త్రిశూర్, మళప్పురం, కొల్లం, పాలక్కాడ్ జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2018, 2019 ఏడాదుల్లో కూడా ఇదే తరహా వరదలు మళయాళీలను వణికించాయి. భారీ వరద కారణంగా ఇప్పటికే పలు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడి రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
వరద ప్రవాహం దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అరేబియా మహా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణీ ప్రభావంతో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. వాతావరణ శాఖ అధికారుల అంచనాలకు మించి వర్షాలు కురుస్తుండటంతో... పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తేయాకు తోటలు, పర్వత శ్రేణులు ఎక్కువగా ఉండే కొట్టాయం, ఇడుక్కి, పథనం థిట్ట జిల్లాల్లో ఇప్పటికే రికార్డు వర్షపాతం నమోదవుతోంది. వరద ప్రభావంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటి మునిగిపోయాయి. అళప్పుజ, ఎర్నాకుళం, త్రిశూర్, మళప్పురం, కొల్లం, పాలక్కాడ్ జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2018, 2019 ఏడాదుల్లో కూడా ఇదే తరహా వరదలు మళయాళీలను వణికించాయి. భారీ వరద కారణంగా ఇప్పటికే పలు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడి రహదారులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.