అయితే ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లలో ధైర్యం వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధికారం కోల్పోయి రెండున్నర ఏళ్ల కాలం పూర్తయింది. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా అధికార పార్టీ హవా కొనసాగింది. ఇంకా చెప్పాలంటే... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కనీస స్థానాలను కూడా తన ఖాతాల్లో వేసుకోలేకపోయింది. పైగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంకా సైలెంట్గా ఉంటే... పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని తెలుగు తమ్ముళ్లు గుర్తించినట్లు ఉన్నారు. దీంతో ఇకపై ప్రభుత్వంపైన, అధికార పార్టీ నేతలపైన పోరాటం చేసేందుకు టీడీపీ నేతలు రెడీ అవుతున్నారు. ఓ వైపు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రజాక్షేత్రంలో తేల్చుకున్న తర్వాతే మళ్లీ అసెంబ్లీలో కాలు పెడతా అంటు ఇప్పటికే శపధం చేశారు. దీంతో అధినేత బాటలోనే తెలుగు తమ్ముళ్లు కూడా ప్రజా పోరాటానికి రెడీ అవుతున్నారు.
అయితే ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లలో ధైర్యం వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అధికారం కోల్పోయి రెండున్నర ఏళ్ల కాలం పూర్తయింది. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా అధికార పార్టీ హవా కొనసాగింది. ఇంకా చెప్పాలంటే... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కనీస స్థానాలను కూడా తన ఖాతాల్లో వేసుకోలేకపోయింది. పైగా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంకా సైలెంట్గా ఉంటే... పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని తెలుగు తమ్ముళ్లు గుర్తించినట్లు ఉన్నారు. దీంతో ఇకపై ప్రభుత్వంపైన, అధికార పార్టీ నేతలపైన పోరాటం చేసేందుకు టీడీపీ నేతలు రెడీ అవుతున్నారు. ఓ వైపు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రజాక్షేత్రంలో తేల్చుకున్న తర్వాతే మళ్లీ అసెంబ్లీలో కాలు పెడతా అంటు ఇప్పటికే శపధం చేశారు. దీంతో అధినేత బాటలోనే తెలుగు తమ్ముళ్లు కూడా ప్రజా పోరాటానికి రెడీ అవుతున్నారు.