ఆ తర్వాత 2014 - 2019 లో జరిగిన రెండు ఎన్నికల్లోనూ వైసీపీ నుంచి పోటీ చేసిన పోతుల రామారావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఇప్పుడు కందుకూరు నియోజకవర్గం లో వైసిపి సీన్ పూర్తిగా రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో గెలిచిన మాజీ మంత్రి మహీధర్ రెడ్డి సొంత పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఈ నియోజకవర్గంలో టిడిపి ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే 1994 - 1999 ఎన్నికల్లో విజయం సాధించింది.
ఆ తర్వాత ఇక్కడ ఒక్కసారి కూడా టిడిపి గెలవలేదు. గతంలో కాంగ్రెస్ నుంచి ఇక్కడ వరకు విజయాలు సాధించిన మహీధర్ రెడ్డి ... గత ఎన్నికల్లో వైసీపీ లోకి వచ్చి విజయం సాధించారు. వ్యక్తిగతంగా మహీధర్ రెడ్డి కి మంచి పేరే ఉన్నా.. తాను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజలకు ఏమీ చేయలేక పోతున్నానన్న బాధ ఆయనలో ఉంది.
సీనియర్ ఎమ్మెల్యే గా ఉండి కూడా నియోజకవర్గంలో చిన్నచిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఆయన తప్పుకుంటే ఇక్కడ వైసిపికి ఇక్కడ సీన్ లేదని అంటున్నారు. వైసీపీ కంచుకోటలో ఇప్పుడు ఆ పార్టీకి కష్టాలు తప్పేలా లేవు.