వారిని తిరిగి కార్యాలయాలకు రప్పించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాయట. కొన్ని కంపెనీలు అయితే కొత్త కొత్త ఆఫర్ లను కూడా ప్రకటిస్తున్నాయి. అయితే మేజర్ ఉద్యోగస్తులు మాత్రం ఇంటి వద్ద నుండే పని చేయాలని కోరుకుంటున్నారట. అయితే ఇటువంటి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ గురించి బ్రిటన్ ప్రధాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. వర్క్ ఫ్రమ్ హోం వలన ఉద్యోగుల దృష్టి వర్క్ పై పూర్తిగా పెట్టలేరని అలాగే... దృష్టి మరలుతుందని, ఈ విధానంతో నాకెదురైన అనుభవం ఇది అంటూ బోరిస్ జాన్సన్ ఇలా చెప్పుకొచ్చారు. ఇంటి నుంచి పని చేసే సమయంలో మధ్యలో ఇంకో కాఫీ తెచ్చుకునేందుకు మనం ఎక్కువ సమయం కేటాయిస్తాము అని అలాగే మళ్లీ తినుబండారాలు తెచ్చుకోవడానికి అలా నడుచుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి తెచ్చుకుని తినడం ప్రారంభిస్తాం అని... తిరిగి నిదానంగా నడుచుకుంటూ ల్యాప్ టాప్ వద్దకు వచ్చే సరికి మనం చేస్తున్న పని ఎంటి అన్నది కూడా గుర్తుండదు అని, మరచిపోతామని బోరిస్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
అందుకే మళ్లీ కార్యాలయాలకు వచ్చి విధులు చేయడం అన్నది అవసరం అని, అయితేనే వర్క్ పై ఏకాగ్రత పెరుగుతుందని...కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలను అందుకోవచ్చు అని.. చుట్టూ మనతోటి ఉద్యోగుల కారణంగా పోటీతత్వం పెరిగి మరింత సమర్థవంతంగా పనిచేస్తారని, చుట్టూ ఇతరులుంటే మన ఉత్సాహంతో పాటు సరికొత్త ఐడియాలతో పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ఇది కాకుండా ఆఫీసులో సీటింగ్ లాగా మనకు ఇంటి వద్ద సౌకర్యవంతంగా ఉండదని చెప్పుకొచ్చారు.