ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి ప్రస్తుతం 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు కాకుండా ఇతర రాజకీయ పార్టీల నుండి ఆకర్షితులైన వారు అయిదు మంది ఉన్నారు. అలా వైసీపీ అసెంబ్లీ బలం 156 కు చేరుకుంది. దాదాపుగా మూడున్నరేళ్లు పాటు ఆ పార్టీలో ఉన్న వీరిలో ఎవరైనా పక్క పార్టీలోకి వెళ్ళ్లాని అనుకుంటారా ? కానీ ఇది ఒక ఎమ్మెల్యే విషయంలో నిజం అయ్యేలా ఉంది. అయితే రాజకీయంలో ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారు అని చెప్పడానికి వీలు ఉండదు. తమ రాజకీయ స్వార్ధాలకు ప్లాట్లు ఫిరాయించడం పరిపాటి. ఇంతకు ముందు ఇలాంటివి చాలానే జరిగాయి. ఇక పార్టీ అధిష్టానం సైతం సరిగా పనిచేయని ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా... పక్కకు పెట్టేస్తుంటారు.

అక్కడే అసలు సమస్య మొదలు అవుతుంది. ఇలాంటి ఎమ్మెల్యేలు పార్టీ నుండి బయటకు వెళ్ళడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ కొందరు అయితే వేంటనే బయట పడిపోతారు.. కానీ మరికొందరు మాత్రం ఎన్నికల సమయం వరకు ఆగి.. ఒకవేళ తమకు సీటు కేటాయించకపోతే అప్పుడు జంప్ అవడానికి రెడీ అవుతారు. ఇక ఇటీవల కూడా సీఎం జగన్ వరుసగా మీటింగ్ లు పెట్టి పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను మందలించారు. ఇప్పటి వరకు హెచ్చరికలు వరకే జరిగాయి.. మిగిలిన ఈ కాస్త సమయంలో ప్రజలతో కలవకుండా తమ పనితీరును నిరూపించుకోకపోతే ఉద్వాసన తప్పేలా లేదు.

ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు ముందగానే పక్కదారి పడుతున్నారట. ఆయన పార్టీ మారడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని నియోజకవర్గంలో వినిపిస్తోంది. ఇది కనుక జరిగితే వైసీపీ నుండి వెళ్ళిపోయినా మొదటి ఎమ్మెల్యే దొరబాబు అవుతారు. అయితే ఈయన ఏ పార్టీలోకి వెళుతారు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం దొరబాబు జనసేన లోకి వెళ్ళడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: