
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి చంద్రబాబుకు వైఎస్ కు, ఇప్పుడు చంద్రబాబుకు, జగన్ కు రాజకీయంగా విబేధాలు ఉన్నాయి. కానీ పవన్ కల్యాణ్ కు జగన్ అంటే ఎందుకు కోపం అని చాలా మందికి తెలియడం లేదు. బహిరంగ వేదికలపై ఎప్పుడు మాట్లాడిన జగన్ ను గద్దె దించాలని అనుకుంటున్నామని, ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్లు చెబుుతుంటారు. అసలు విషయం ఏమిటంటే 2009 లో ప్రజారాజ్యం పెట్టిన సమయంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ ఉన్నారు.
అప్పుడు కాంగ్రెస్ నాయకులు, వైఎస్ రాజశేఖర రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంచలూడే దాకా తరిమి కొడతాం అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో పవన్ కు బెదిరింపు కాల్స్ చాలానే వచ్చాయి. వందల కాల్స్ చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చేవని తెలుస్తోంది.
విదేశాలకు వెళ్లిన కూడా పవన్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవి. చివరకు సిమ్ కార్డులు మార్చారు.
బాడీగార్డులను కూడా విడిచిపెట్టి ఏకాంతంగా ఉన్నా బెదిరింపు కాల్స్ ఆగేవి కావని తెలిసింది. దీంతో పవన్ కు సన్నిహితుడు ఒకరు చెప్పిన విషయం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడికి విదేశీ కాల్స్ నుంచి నార్మల్ కాల్స్ కు మార్చే ఐఎస్ఓడీ కంపెనీ ఉందని ఇది మొత్తం జగన్ చేస్తున్నారని తెలిసింది. అప్పటి నుంచి జగన్ అంటే పవన్ కు కోపం అని చర్చ నడుస్తోంది