ముఖ్యమంత్రి పర్యటనకు ఆహ్వానం అందకపోవడంతో తీవ్ర మనస్థాపంతో ఒంగోలులో జరిగిన సీఎం వైఎస్‌ జగన్ పర్యటనకు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి దూరంగా ఉన్నారు. నగరంలో ఇళ్ళు లేని 21 వేల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 23న ఒంగోలుకు వచ్చారు. అయితే సీఎం పర్యటనలో ఎంపీ మాగుంటకు ఆహ్వానం ఆందలేదు. మరోవైపు ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డితో పాటు ఇతర వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి సభలో పాల్గొన్నారు.అయితే మాగుంటకు ఈసారి వైసీపీ టికెట్‌ లేదని ఆ పార్టీ అధిష్టానం తేల్చి చెప్పిన నేపధ్యంలో ఆయనకు ఆహ్వానం అందకపోవడం వైసీపీలో తీవ్ర చర్చ అనేది నడిచింది. కనీసం ముఖ్యమంత్రి పర్యటనలోనైనా ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందుతుందని భావించారు మాగుంట. అయితే అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మాగుంట ఒంగోలుకు రాలేదు.ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పర్యటనకు మాగుంట దూరంగా ఉండిపోయారు.దాదాపు రెండు నెలల క్రితమే వైసీపీ సిట్టింగ్ ఎంపీ మాగుంటకు తిరిగి టికెట్ ఇచ్చేదీ లేదని అధిష్టానం తేల్చి చెప్పడంతో ఆయనకు సీటు తిరిగి ఇవ్వాలని మాజీ మంత్రి ఇంకా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి నెలరోజులపాటు అధిష్టానంతో పోరాటం చేశారు. అయితే వైఎస్‌ జగన్‌ స్వయంగా బాలినేనితో మాట్లాడిన తరువాత బాలినేని మెత్తపడ్డారు.


ఈ పరిస్థితుల్లో మాగుంట తెలుగుదేశం పార్టీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది. ఒకవైపు వైసీపీలో టికెట్‌ లేకపోవడం ఇంకా మరోవైపు తెలుగుదేశం పార్టీతో మాగుంట టచ్‌లో ఉన్నారన్న ప్రచారంతో ఒంగోలులో జరిగిన ముఖ్యమంత్రి పర్యటనకు స్థానిక సిట్టింగ్ ఎంపీ మాగుంటకు ఆహ్వానం అందలేదు.ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగానే అధికారులు కూడా ప్రోటోకాల్‌ను కూడా పక్కన పెట్టి ఎంపీ మాగుంటకు ఆహ్వానం పంపలేదని సమాచారం తెలుస్తోంది.ముఖ్యమంత్రి జగన్ ఒంగోలు పర్యటనకు ఆహ్వానం అందని నేపధ్యంలో ఎంపీ మాగుంట టీడీపీకి లేదా, బిజెపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. ఇక ఈ నేపధ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాగుంట పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు టీడీపీ – జనసే కూటమిలో బీజేపీ చేరితే జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ నుంచి ఒంగోలు ఎంపీగా మాగుంట పోటీ చేస్తే బాగుంటుందని ఆయన అనుచరులు సూచిస్తున్నారు. ఒకవేళ టీడీపీ – జనసే కూటమిలో బీజేపీ లేకపోతే టీడీపీ నుంచే ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు మాగుంట ప్లాన్ చేసుకుంటున్నట్టు చెబుతున్నారు.ఏదిఏమైనా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారే విషయంపై క్లారిటీ వచ్చింది. ఈసారి టీడీపీ లేదా బీజేపీ నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని కూడా ఎన్నికల్లో పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: