![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/pawan-kalyan-hari-rama-jogayya-comments73a5902c-25d8-43e8-80a8-5001113c9805-415x250.jpg)
మరపక్క జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ రెండో సారి వైసిపి పార్టీ అధికారంలోకి రాకూడదని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. ఓట్ల చీలకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకొని మరి పాల్గొనబోతున్నారు.. ఈ క్రమంలోనే ఇటీవలే తాడేపల్లిగూడెంలో జెండా పేరిట టిడిపి జనసేన సంయుక్తంగా ఒక భారీ సభను సైతం ఏర్పాటు చేశారు.. ఈ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు ఒక సంచలనంగా మారిపోయాయి..
తను గెలవక పోవడానికి ముఖ్య కారణం నాయకులు కార్యకర్తలు అంటూ వారిపైన ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో తనకి ఎవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా గట్టిగానే కౌంటర్ వేశారు పవన్ కళ్యాణ్.. అనంతరం కాపు సంక్షేమ సేవకుడు హరి రామ జోగయ్య ఒక లేఖను కూడా రాశారు.. జనసేన తెలుగుదేశం పార్టీ బాగు కోరే సలహాలను ఇచ్చానని.. అయితే అవి నచ్చకపోతే వారి కర్మ అంటూ వాక్యాన్ని ఇచ్చారు. అయితే అంతలోనే తన కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఇది ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొన్నది అయితే ఇప్పుడు తాజాగా జనసేన పార్టీపై హరి రామ జోగయ్య మాట్లాడుతూ తాను చచ్చేంత వరకు జనసేన పార్టీతోనే ఉంటానని పవన్ కళ్యాణ్ వెనుక పోరాటానికి సపోర్టుగా ఉంటానంటూ వ్యాఖ్యానించారు.. అనుభవం లేని వారి సలహాల వల్ల పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎవరు ఏమనుకున్నా తనతోనే పనిచేస్తానంటూ వెల్లడించారు.