![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/cm-jagan-ali4c813e51-11ce-40f4-b835-a600cbc36be5-415x250.jpg)
ముఖ్యంగా కమెడియన్ ఆలీకి ముస్లింలలో ఎక్కువగా ఉన్న నంద్యాల పార్లమెంటు నుంచి దింపాలని వైసిపి వర్గాలలో వార్తలు వినిపించాయి. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ కూడా సీటు ఖరారు చేశారని త్వరలోనే దీనిపైన ప్రకటన వస్తుందని వార్తలు వినిపించాయి.. వాస్తవానికి ఆలీని గుంటూరు లేదా రాయలసీమ జిల్లాలోని మైనార్టీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు.అయితే చర్చల అనంతరం కర్నూలు లేదా నంద్యాల పార్లమెంటు నుంచి ఏదో ఒక స్థానంలో నిలవాలంటే జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
గత ఎన్నికలకు ముందు ఆలి వైసీపీలో చేరారు.. ఆ పార్టీ తరఫున నియోజవర్గాలలో కూడా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే తన సొంత ఊరు రాజమండ్రి నుంచి టికెట్ ఆశించగా అది నెరవేరలేదు.అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చెప్పిన జగన్ చివరకు అలాంటి పదవులు రాకపోవడంతో 2021లో ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునుగా నియమించారు.. అయితే గతంలో సీటు రాకపోయినందుకు ఆలి నిరుత్సాహంతో ఉండడంతో ఈసారి మరి పిలిచి లోక్ సభ పోటీ చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అందుకే నంద్యాల లేదా కర్నూలు జిల్లాలలో ఎక్కడో ఒకచోట నుంచి ఆలీని నిలబెట్టేలా ప్లాన్ చేస్తున్నారు.