![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/pawan-jagand3b2fb42-070e-4c27-8558-893e564e8b45-415x250.jpg)
ప్రస్తుతం రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ జనసేన అదే స్థానం నుంచి బరిలోకి దిగితే అక్కడ వైసిపి నేత ముద్రగడను బరిలో దింపే విధంగా జగన్ పలు రకాల వ్యూహాలను వ్యవహరిస్తున్నారట.. గత కొన్నేళ్లుగా ముద్రగడ జనసేనలో చేరుతారని వార్తలైతే వినిపించాయి.. ప్రస్తుతం జనసేన పార్టీకి దూరంగా ఉన్న ముద్రగడ ఈ నేపథ్యంలోను వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం..
ముద్రగడను వైసీపీలో చేర్చుకొని పవన్ కళ్యాణ్ పైన పోటీగా దింపే ఎలా వైసిపి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.. కాపు ఓటు బ్యాంకు అన్ని పార్టీలకు ప్రధానమని చెప్పవచ్చు.. ముఖ్యంగా అక్కడ పవన్ కళ్యాణ్ సీటు ఎన్నుకొని అవకాశం ఉంది.. కనుక కాపులలో మంచి పట్టు ఉన్న ముద్రగడను బదిలోకి దింపితే కాపుల మద్దతు కచ్చితంగా లభిస్తుందని వైసీపీ క్యాడర్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. మరి ముద్రగడ పవన్ కు పోటీగా ఎన్నికలలో నిలిస్తే ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఎన్నికలు చాలా రసవత్తంగా ఉంటాయి.. గతంలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో మెగా ఫ్యామిలీకి మద్దతుగా ఉన్న ముద్రగడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి పోటీగా నిలుస్తే ఏం జరుగుతుందో చూడాలి.