![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/pawan-chandrababu5157f0a7-9846-41e0-8be1-e1254aa4a6de-415x250.jpg)
ఒకసారి 2019 ఎన్నికల నుంచి వైసీపీ విజయాల ఓట్ల గణాంకాల విషయానికి వస్తే ఈ ఐదేళ్లలో పార్టీ చాలా బలపడిందని ఆ పార్టీ నేతలే తెలియజేస్తున్నారు.. ఈ విషయాన్ని ఇతర పార్టీ నేతలు కూడా పలు సందర్భాలలో తెలిపారు.. 2019 ఎన్నికలలో 50% దాకా ఓట్ షేర్ వైసిపి పార్టీ సంపాదించింది.. ఈ 5 సంవత్సరాలలో మళ్ళీ 5 నుంచి 10 శాతం వరకు ఓటింగ్ శాతం పెరిగిందని అందుకే స్థానిక ఎన్నికలలో 2019 సాధారణ ఎన్నికలలో కంటే మరింత ఓటు బ్యాంకు పెరిగిందని తెలియజేస్తున్నారు.
దీన్ని బట్టి చూస్తే తమ పార్టీకి 60 శాతం ఓట్ షేర్ కలిగి ఉందని వైసిపి నాయకులు తెలియజేస్తున్నారు.. ఇలాంటి సమయంలో ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకుని వచ్చిన ఎవరు వచ్చిన గెలిచేది జగనే అంటూ తెలుపుతున్నారు.. టిడిపి గతసారి 40% ఓట్ల షేర్ ని రాబట్టింది. జనసేనకు 6 శాతం వచ్చింది.. ఈసారి రెండు పార్టీలు కలుపుకుంటే కేవలం 46% మాత్రమే షేరింగ్ ఉంటుంది.. అందుకే ఈసారి కూడా కూటమి తో 50% పైగా ఓటింగ్ వస్తుందనీ.. టిడిపి జనసేన చెబుతున్న..ప్రస్తుతం వైసీపీ పార్టీకి పాజిటివ్ వేవ్ ఉంది.. కాబట్టి 60 శాతం ఓట్లు వస్తాయని ధీమాతో ఉన్నారు.. దీన్నిబట్టి చూస్తే ప్రతి 10 మంది ఓటర్లలో 6 మంది వైసీపీకి నలుగురు టిడిపి కూటమికి వేసిన వైసిపి వాళ్ళు విజయం అందుకుంటారని చెబుతున్నారు.. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలుస్తామనే భీమ కలగాలని మిగులుతుందని చెప్పవచ్చు.