అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ తగిలింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ అనేది జరగనుంది. ఏప్రిల్ 4వ తేదీన దస్తగిరి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణ సందర్భంగా అప్రూవర్ గా మారిన దస్తగిరి కి బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం లేదన్న అవినాష్ తరుపు న్యాయవాది గట్టిగా వాదించడం జరిగింది. అయితే నెల రోజుల ముందు NIA కేసులో అప్రూవర్ వేసిన పిటిషన్ ను డివిజన్ బెంచ్ అనుమతించిందని హైకోర్టు గుర్తు చేసింది. అప్రూవర్ కి అడిగే హక్కు ఉందని డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ స్పష్టంగా ఉందన్న కోర్టు .. అప్రూవర్ దస్తగిరి పిటిషన్ ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది.అప్రూవర్ గా ఉన్న దస్తగిరిని  ఓ కేసులో అరెస్ట్ చేసి ఆరు నెలలకుపైగా పులివెందుల జైల్లో పెట్టారు.


ఈ సందర్భంగా తనను జైల్లో ప్రలోభ పెట్టారని దస్తగిరి ఆరోపించడం జరిగింది. ఏకంగా 20 కోట్ల నగదుని జైల్లోకే తెచ్చారని పిటిషన్ వేశారు. పైగా తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తన కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో మంజూరు చేసిన ముందస్తు బెయిల్ షరతులు అవినాష్ రెడ్డి అతిక్రమించారని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అంతకు ముందు ఆయన కుటుంబసభ్యులపై దాడి కూడా జరిగింది. తరువాత ఈ విషయంపైనా కోర్టును ఆశ్రయించారు. తన తండ్రిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి , భార్య భారతి , దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, అతని కుమారుడు చైతన్య రెడ్డి అనుచరులు దాడి చేశారని తెలిపారు. విట్‌నెస్ ప్రొటెక్షన్ స్కీం కింద కుటుంబ సభ్యులకు భద్రతని కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని దస్తగిరి కోర్టును కోరడం జరిగింది. కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పులివెందుల నుంచి జగన్ మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తానని దస్తగిరి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: