ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు  బెట్టింగ్ రాయుళ్లకు పండగే పండగ.  కేవలం క్రికెట్ కబడ్డీ, ఫుట్బాల్ వంటి పెద్ద పెద్ద  గేమ్స్ ఆడినప్పుడు ప్లేయర్లపై  బెట్టింగ్స్ పెడుతూ ఉంటారు. అలాంటి బెట్టింగ్స్ ప్రస్తుతం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  పార్టీలపై పెడుతున్నారు. టిడిపి కూటమి గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్ పెడుతుంటే, వైసిపి గెలుస్తుందని మరి కొంతమంది బెట్టింగ్స్ పెడుతున్నారు. అయితే గత నెల రోజుల నుంచి ఇప్పటివరకు ఈ బెట్టింగ్ వ్యవహారంలో మార్పు కూడా వచ్చింది. గత నెల రోజుల క్రితం  ఏపీలో వైసిపికి ఐదు పార్లమెంటు సీట్లు వస్తాయని బెట్టింగ్ లో పెట్టారు. 

కానీ నెల రోజులు గడిచిన తర్వాత  ఈరోజుకి ఆ సీట్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం బెట్టింగ్ రాయలళ్లు వైసీపీ కి 11 సీట్లు తప్పక వస్తాయని 13 సీట్లు కాస్త అటు ఇటుగా ఉంటాయని  బెట్టింగ్ పెట్టారు. అంటే నెల రోజుల వ్యవధిలో  టిడిపి కంటే వైసీపీ  గాలి పెరిగింది అని చెప్పవచ్చు. అంటే రోజురోజుకు కూటమి  చప్పబడిపోతుంటే , వైసిపి పార్టీ మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్తుందని చెప్పవచ్చు.  దీనికి ప్రధాన కారణం  కూటమిలోని వ్యక్తుల గురించి వైసిపి క్షుణ్ణంగా వివరిస్తూ, వారి వల్ల ప్రభుత్వం నిలబడదనే నినాదం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు వైసీపీ అధినేత జగన్. అంతేకాకుండా  నేను మళ్ళీ సీఎం అయితే ఎలాంటి గొడవ లేకుండా ప్రభుత్వ పాలన హ్యాపీగా సాగుతుందని  ప్రజలకు భరోసా కల్పిస్తున్నాడు.

అలాగే రాయి ఘటన కూడా జగన్ పై మరింత సింపతిని పెంచింది. అంతేకాకుండా ముప్పేట దాడి చేసినట్టు  జగన్ పై అన్ని పార్టీలు కలిసి దాడి చేస్తున్నారు కాబట్టి ప్రజల్లో కూడా ఒక్కడిని చేసి ఇంతమంది ఎదుర్కొంటున్నారా అనే నినాదం కూడా వెళ్ళిపోతోంది. ఈ విధంగా కూటమి యొక్క  మైనస్ పాయింట్లను తనకు ప్లస్సుగా మార్చుకుంటూ జగన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ విధంగా తన మానియాను రోజు రోజుకి  పెంచుకుంటున్నారు.ఎలక్షన్స్ కు ఇంకా 22 రోజుల సమయం ఉండటంతో రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దీంతో ఎన్నికల పోలింగ్ రోజు ప్రజల అభిప్రాయం ఏ పార్టీ వైపు వెళ్తుందో చెప్పడం కష్టంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: