![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ycp-6f74bf9b-f904-4852-b9f0-15d16ec21ae8-415x250.jpg)
మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అనీషా రెడ్డితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఆమెకు తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారట. అనీషా రెడ్డి, ఆమె భర్త శ్రీనాథ్ రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరి ఎత్తుగడ పలమనేరు, పుంగనూరు రెండింటిలోనూ అధికార పార్టీకి మేలు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పలమనేరులో అనీషా రెడ్డి మారడం వల్ల అమర్నాథ్రెడ్డికి ఓటమి తప్పదనే ఆందోళన నెలకొంది.అనీషా రెడ్డికి అమర్నాథ్రెడ్డి బావ వరుస అవుతారు. అందువల్ల బావను ఓడించడానికి మరదలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారని సరదాగా రాజకీయ వర్గాల్లో ప్రచారం మొదలైంది. మరి మరదలు బావని ఓడ గోడుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.