ఇటీవల టీడీపీకి సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైసీపీ 147 సీట్లలో బలంగా ఉందని ఆ వీడియోలో వినిపించింది. దీంతో ఇది కాస్తా వైరల్ గా మారింది. ఈక్రమంలో ఇప్పుడు టీడీపీకి సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.


ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ నకు ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నాయకులు సిద్ధం అవుతున్నారు. అవును.. తాజాగా టీడీపీ ఆఫీసులో ఆ పార్టీ ఎన్నారై విభాగం కో ఆర్డినేటర్ కోమటి జయరాం పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇది తెగ హల్ చల్ చేస్తోంది. ఇందులో ఓటర్లకు డబ్బులు ఎలా పంచాలో ఆయన పలు సూచనలు చేశారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది అంటే..


ఇప్పుడు మనం అంతా ఫోకస్డ్ గా వెళ్తేనే పని జరుగుతుంది. 5 నుంచి 10 కుటుంబాలను ఫోకస్ చేయాలి. మనం మన ఊరెళ్తే ఈ వెధవ మనకు ఓటు వేయడనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం వెలికి తీయాలి. వాడికి ఏ రకంగానైనా మనకున్న ఎబిలిటీతో వాడికున్న అవసరం ఏమిటో తెలుసుకొని ట్యూన్ చేసుకోగలిగితే నాలుగైదు ఓట్లు మారతాయి.


ప్రతి నియోజకవర్గంలో వెయ్యి ఓట్లు మార్చినా చాలు. మనం అంతదూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వారిమి అవుతాం. దీనిపై పని చేయడానికి ఇదే సమయం. ఇకవేళ డబ్బుతో మార్చగలిగినా.. రూ. రెండు, మూడు లక్షలతో ఆ పది కుటుంబాలను మార్చగల కెపాసిటీ మనకుంది. ఈ రూంలో ఉన్నవారికి రెండు, మూడు లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద విషయం కాదు అని ఈ వీడియోలో ఉంది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఓటరును తిట్టడంతో పాటు.. డబ్బు పెట్టి ఓటు కొనుగోలు చేయడం వెనుక వారి ఉద్దేశం బయటపడిందని పలువురు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: