![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/lokesh-ktr8face985-3250-4c40-b224-42311ee9298e-415x250.jpg)
ఎన్నికల నామినేషన్ పత్రాల్లో నారా లోకేష్ తన ఆస్తుల విలువ దాదాపు రూ.542.7 కోట్లుగా ప్రకటించారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి ఎం, లావణ్య ఆయనపై పోటీ చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన కుటుంబ ఆస్తులుగా రూ.373.63 కోట్లుగా ప్రకటించారు. తన కుటుంబానికి చెందిన ₹339.11 కోట్ల విలువైన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్లో కోటి రూపాయలకు పైగా షేర్లను ఒక్కొక్కటి రూ.337.85 చొప్పున కలిగి ఉన్నారు. ఆయన భార్య నారా బ్రాహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అఫిడవిట్ ప్రకారం, లోకేష్ రూ.314.68 కోట్ల విలువైన చరాస్తులు, రూ.92.31 కోట్ల విలువైన స్థిరాస్తులను కలిగి ఉన్నారు. ఆయన భార్య బ్రాహ్మణి పేరుతో రూ.45.06 కోట్ల స్థిరాస్తులు, రూ.35.59 కోట్ల చర ఆస్తులను కలిగి ఉన్నారు. అయితే ఇటీవల ఎన్నికల సమయంలో కేటీఆర్ తెలంగాణలో నామినేషన్ సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఇలా ఆస్తులు కలిగి ఉన్నారు. కేటీఆర్-శైలిమ దంపతుల పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ.51 కోట్లు. కేటీఆర్ వద్ద కంటే ఆయన భార్య శైలిమ వద్దే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. కేటీఆర్ వద్ద రూ.6.92 కోట్ల చరాస్తులు ఉన్నాయి. బ్యాంకు ఖాతాల్లో నగదు, డిపాజిట్లు, టీ న్యూస్ ఛానల్లో పెట్టుబడులు, బంగారం వంటివి ఇందులో ఉన్నాయి. ఇక రూ.17.83 కోట్ల విలువైన స్థిర ఆస్తులు ఉన్నాయి. అంతేకాకుండా ఆయనకు రూ.11.89 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి.