ఆంధ్రప్రదేశ్లోని సోమవారం రోజున ఓటింగ్ పూర్తి అయ్యింది.. ఓటింగ్ పర్సంటేజ్ కూడా 81% వరకు జరిగినట్టుగా తెలుస్తోంది. గతంలో కంటే ఈసారి కాస్త మరింత ఎక్కువగానే ఓటింగ్ పోలింగ్ నమోదైనట్లుగా సమాచారం. ముఖ్యంగా కమ్మ, కాపు సామాజిక వర్గం ఓట్లు ఎవరికి పడ్డాయి అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. కమ్మ సామాజిక వర్గపు వారు కసిగా ఓటు వేశారని తెలుస్తోంది. ఖచ్చితంగా జగన్ కి ఆపోజిట్ గానే ఓటు వేశారు. వందకి 95 మంది కూటమికి మద్దతు ఇచ్చారు.


కాపు సామాజిక వర్గం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో.. 14% వరకు ఉన్నారు.. ఈ 14%లో 9% వరకు కూటమికి మద్దతు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. కూటమిలో ముఖ్యంగా జనసేన పార్టీ ఉండడం చేత ఇది ఎక్కువైనట్లుగా తెలుస్తోంది. ఇక్కడ కూడా జగన్ కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా వేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే అప్పుడు ఏం జరుగుతుందనే విషయానికి వస్తే.. ఓవరాల్ గా చూస్తే.. కమ్మ, కాపు సామాజిక వర్గాలు కాంబినేషన్ కలిసినప్పుడు.. కృష్ణ, గుంటూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఉమ్మడిగా ఉన్నటువంటివి.. విశాఖపట్నం ఎక్కువగానే ఉన్నారు.


ఇక్కడ సులువుగా 40 స్థానాలను  సులువుగా సంపాదించుకుంటుందని కూటమి చెప్పవచ్చు.. గతంలో 2014లో చూస్తే.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కేవలం 5 స్థానాలను మాత్రమే అక్కడ వైసిపి పార్టీ గెలుచుకుంది.. అది తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమగోదావరిలో అసలు ఖాతాని ఓపెన్ చేయలేదు. మొన్నటిసారి అక్కడ చాలా ఘనంగా సీట్లను సాధించింది వైసిపి.. అక్కడ ఎన్ని స్థానాలు సాధిస్తారు అనేది ఇప్పుడు ప్రధాన అంశం.. ముఖ్యంగా 34 సీట్లల్లో వైసిపి పార్టీ ఎంతవరకు సంపాదిస్తుందనేది ఇక్కడ కీలకమైన ప్రశ్నగా మారుతోంది. 2019లో ఏకంగా 27 స్థానాలను వైసీపీ గెలిచింది.. మరి ఇక్కడ కూటమి ఎక్కువ సీట్లు సాధిస్తే గెలిచే అవకాశం ఉంటుంది.. ఒకవేళ వైసీపీ పార్టీ ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలిస్తే ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: