![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/keshanani-nani545f4ec1-1c2a-4e8b-811c-d47c28ca689c-415x250.jpg)
అలాంటి నియోజకవర్గంలో ఎంపీగా గెలవడం అంటే మామూలు విషయం కాదు. మంచి పేరు ఉంటేనే, మనోడు మనకు మంచి చేస్తాడు అనుకుంటేనే ప్రజలు ఓట్లు వేస్తారు. అలాంటి మంచి పేరు తెచ్చుకున్నారు కేశినేని నాని. ఆయన విజయవాడను బాగా అభివృద్ధి చేశారు. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. కొద్దిగా కోపం ఎక్కువ కానీ ప్రజలకు మంచి చేయాలనే మనస్తత్వం ఎక్కువ. అందుకే ఆయనకు పోయినసారి వైసీపీకి చాలా గాలి ఉన్నప్పటికీ భారీ లెవెల్లో ఓట్లు పడ్డాయి. క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు.
నాని 2014లోనూ విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2024లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగానే మళ్లీ పోటీ చేశారు. ఆయన గెలుస్తారా లేదా అనేది జూన్ నాలుగో తేదీన తేలనుంది. విజయవాడలో టీడీపీకి ఎక్కువ ఓట్లు పడుతుంటాయి. కానీ ఈసారి కేశినేని నాని కారణంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కేవలం నానిని చూసి విజయవాడ ప్రజలు వైసీపీకి కళ్ళు మూసుకుని ఓట్లు గుద్దినట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచే టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ పోటీ చేస్తున్నారు ఆయన నానికి తమ్ముడు అవుతారు. అయితే ఈసారి విజయవాడ ప్రజలను టీడీపీకే ఓట్లు వేసిన ఎంపీ ఓట్లు మాత్రం నానికే ఓట్లు వేసినట్లు చర్చ జరుగుతోంది. నాన్ కాంట్రవర్షల్ పర్సన్ మంచి చేస్తాడు, మనోడు అనే ప్రేమ ఇప్పటికే ప్రజలకు ఉన్నట్లు సమాచారం. దాంతో ఈ నేత హ్యాట్రిక్ సక్సెస్ లు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.