![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_analysis/kadapa-sharmila-jagan-pulivendula-avinash-reddy-apa161a82f-8e26-4298-8c16-ed005603083b-415x250.jpg)
• ఒక ఓటు వైసిపి కి మరో ఓటు షర్మిలకి పడిందా..?
• అవినాష్ కి కడప లో ఓటమి తప్పదా..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కడప రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ జిల్లా వైయస్ ఫ్యామిలీకి కంచుకోట. వైయస్ రాజశేఖర్ రెడ్డి తాతా ముత్తాతల నుంచి ఈ జిల్లాపై ఎంతో పట్టు ఉంది. ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ జిల్లాని క్లీన్ స్వీప్ చేశారు. అలాంటి కడప జిల్లాలో ఈసారి క్రాస్ ఓటింగ్ కలవరపెడుతోంది. సీఎం సొంత జిల్లా అయినా ఇక్కడ కాంగ్రెస్ బోని కొట్టబోతోందని తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. కడప పార్లమెంటు బరిలో ఈసారి వైయస్ షర్మిల కాంగ్రెస్ నుంచి బరిలో ఉండగా, పులివెందుల నుంచి అన్న జగన్మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. అంతేకాకుండా ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డిని కడప పార్లమెంటు బరిలో ఉంచారు. ఈ విధంగా ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఈ జిల్లాలో పోటీ చేస్తుండడంతో ఫైట్ చాలా రసవత్తరంగా మారింది.