![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/-assembly-elections9c4c25d3-8c15-4158-a6dd-69a949a52265-415x250.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో ఎదురు లేని నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకు వైసీపీ నేత జగన్ తన కాబినెట్ లో విద్యా శాఖ మంత్రిగా కీలక పదవిని ఇచ్చారు.. అంతేకాకుండా తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బొత్స కుటుంబంలోని ఏకంగా నలుగురికి జగన్ టికెట్లు కేటాయించారు.చీపురుపల్లి నుంచి బొత్స పోటీచేయగా, విశాఖపట్నం లోక్ సభ స్థానం నుంచి బొత్స సతీమణి ఝాన్సీ అలాగే నెల్లిమర్ల నుంచి బొత్స బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు మరియు గజపతినగరం నుంచి బొత్స తమ్ముడు అప్పల నరసయ్య పోటీచేశారు. ఇదిలా ఉంటే ఇటీవల బొత్స మీడియాతో మాట్లాడారు. వచ్చేనెల 4 వ తేదీన వైసీపీ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అదే నెల 9 వ తేదీన ఉదయం 9 గంటలకు విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. ఇంతలోనే ఇలా రాజీనామా లేఖ రావడంతో వైసీపీ నేతలు షాక్ అయ్యారు. అయితే ఇది ఫేక్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.