![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/ap-what-is-the-future-of-those-bjp-leadersef00c2ac-385e-4d5f-96ee-ecec0a10a027-415x250.jpg)
ఆ తరువాత ఆయన రాజమండ్రి వైపు చూసినా భంగపాటు తప్పలేదు. తరువాత పొమ్మనలేక పొగబెట్టారు అన్నట్టు అనపర్తి సీటు ఆయనకోసం ఖాళీ పెట్టి ఉంచగా అక్కడ పోటీ చేసినా పరువు పోతుందని ఆయనకి బాగా తెలుసు.... దాంతో నో చెప్పేశారు. అందువల్లనే ఆయన ఏపీ బీజేపీ అధినాయకత్వం మీద చాలా కోపంగా ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. తరువాత రెండో నేత విష్ణు వర్ధన్ రెడ్డి. ఆయన బీజేపీలో ఎపుడూ యాక్టివ్ గానే ఉంటూ వచ్చారు. కానీ ఈసారి ఆయనకు కూడా భంగపాటు తప్పలేదు. కదిరి అసెంబ్లీ అయినా లేక హిందూపురం ఎంపీ అయినా పోటీకి ఆయన ఆసక్తి చూపారు కానీ టికెట్ దక్కలేదు. దాంతో ఆయన మౌన ముద్రలోకి వెళ్లిపోయారు.
అలాగే రాజ్యసభ సభ్యుడిగా నిన్నటిదాకా చెలామణీ అయినటువంటి తాజా మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆయన కూడా బీజేపీ అంటే మక్కువ ఎక్కువ చూపేవారు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం ఏపీలో బీజేపీలో చేరిన టీడీపీ నేతలకు పలుకుబడి ఎక్కువగా ఉండడం వీరికి గండికొట్టినంత పని అయింది. దాంతో విశాఖ నుంచి ఎంపీ సీటు ఆశించిన ఈయనకు సీటు దక్కలేదు. రేపటి ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిస్తే రానున్న అయిదేళ్ళూ వీరికి అజ్ఞాత వాసమే అని అంటున్నారు విశ్లేషకులు. అలా కాకుండా పొరపాటున వైసీపీ గెలిస్తే వీరు మళ్లీ నోరు తెరచి ఏపీ బీజేపీ అధినాయకత్వం వైఖరి మీద విమర్శలు చేసే అవకాశం కూడా లేకపోలేదు అని అంటున్నారు.